Skip to main content

బోటు వెలికితీత యత్నం ఫలిస్తుందా?...నేటి నుంచి మళ్లీ పనులు

 

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిన ప్రయాణికుల బోటు ‘రాయల వశిష్ట’ వెలికితీత సాధ్యమేనా? ఈసారైనా ప్రయత్నం ఫలిస్తుందా? కనీసం శవాలు కూడా దొరకక చివరి చూపైనా దక్కలేదన్న ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతున్న బాధితుల కుటుంబానికి ఊరట లభిస్తుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఈరోజు నుంచి మరోసారి బోటు వెలికితీత ప్రయత్నాలు మొదలు పెడుతోంది.

సెప్టెంబరు 15వ తేదీన ఈ బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఇంకా 15 మంది జాడ తెలియలేదు. వీరి మృతదేహాలు బోటులోనే చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానంతో బోటును బయటకు తీయాలన్న డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో 25 మంది సభ్యులున్న సత్యం బృందానికి వెలికితీత బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఆ ప్రయత్నాలలో సదరు బృందం రెండుసార్లు విఫలమైంది. 
తాజాగా ఈరోజు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈసారి రెండు భారీ లంగర్లు, 3 వేల అడుగుల రోప్‌ని వినియోగించనున్నారు. వెలికితీత పనుల ప్రగతిపై కచ్చులూరు నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్‌ ఫోన్‌, వైర్‌లెస్‌ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. 
తాజాగా ఈరోజు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈసారి రెండు భారీ లంగర్లు, 3 వేల అడుగుల రోప్‌ని వినియోగించనున్నారు. వెలికితీత పనుల ప్రగతిపై కచ్చులూరు నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్‌ ఫోన్‌, వైర్‌లెస్‌ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...