Skip to main content

బోటు వెలికితీత యత్నం ఫలిస్తుందా?...నేటి నుంచి మళ్లీ పనులు

 

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిన ప్రయాణికుల బోటు ‘రాయల వశిష్ట’ వెలికితీత సాధ్యమేనా? ఈసారైనా ప్రయత్నం ఫలిస్తుందా? కనీసం శవాలు కూడా దొరకక చివరి చూపైనా దక్కలేదన్న ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతున్న బాధితుల కుటుంబానికి ఊరట లభిస్తుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఈరోజు నుంచి మరోసారి బోటు వెలికితీత ప్రయత్నాలు మొదలు పెడుతోంది.

సెప్టెంబరు 15వ తేదీన ఈ బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గల్లంతైన వారిలో ఇంకా 15 మంది జాడ తెలియలేదు. వీరి మృతదేహాలు బోటులోనే చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానంతో బోటును బయటకు తీయాలన్న డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో 25 మంది సభ్యులున్న సత్యం బృందానికి వెలికితీత బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఆ ప్రయత్నాలలో సదరు బృందం రెండుసార్లు విఫలమైంది. 
తాజాగా ఈరోజు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈసారి రెండు భారీ లంగర్లు, 3 వేల అడుగుల రోప్‌ని వినియోగించనున్నారు. వెలికితీత పనుల ప్రగతిపై కచ్చులూరు నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్‌ ఫోన్‌, వైర్‌లెస్‌ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. 
తాజాగా ఈరోజు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈసారి రెండు భారీ లంగర్లు, 3 వేల అడుగుల రోప్‌ని వినియోగించనున్నారు. వెలికితీత పనుల ప్రగతిపై కచ్చులూరు నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్‌ ఫోన్‌, వైర్‌లెస్‌ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.   

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...