Skip to main content

దోమలు తెచ్చి పెట్టే 'డెంగీ'కి దోమలతోనే పరిష్కారం!





డెంగీ జ్వరాల విజృంభన సమాజంలో ఎంతటి అనారోగ్య పరిస్థితులను తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దేశంలో డెంగీ మరణాల సంఖ్య అధికంగానే ఉంది. నిలువెత్తు మనిషిలో ఈ రోగాన్ని చిన్ని దోమ తెచ్చిపెడుతుంది. అయితే, దోమలు తెచ్చి పెట్టే ఈ డెంగీకి దోమల్లోనే పరిష్కారం ఉందని భారతీయార్‌ వర్సిటీ పరిశోధకులు తేల్చారు.

తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఎడిస్‌ ఈజిప్టి దోమల్లో వోల్బాచియా పిపియెంటిస్‌ అనే బ్యాక్టీరియాను కనుగొన్నారు. డెంగీతో పాటు  జికా, చికున్‌ గున్యా  వంటి వైరస్ లు కూడా ఎడిస్‌ దోమల ద్వారానే వ్యాపి చెందుతాయి. అయితే ఈ పిపియెంటిస్ బ్యాక్టీరియాతో దోమలు వైరస్ లను వ్యాప్తి చేయలేవు. తమ సంతానాన్ని పెంచుకోనివ్వకుండా కూడా ఈ ఇది నిరోధిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న దోమలు ఇతర దోమలతో కలిస్తే వాటికి కూడా ఇది సోకుతుంది. దీంతో దోమలను నిర్మూలించవచ్చని పరిశోధకులు తేల్చి చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.