Skip to main content

జగన్ పై విమర్శలు చేయడమే పవనిజమా?: ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్



జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘జగన్ పై విమర్శలు చేయడమేనా పవనిజం? తెలుగుదేశం పార్టీతో లాలూచీ పడ్డ మీరు జగన్ తో పేచీ పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వైఖరిని విమర్శిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటి? అన్న మీరు ఇప్పుడు తెదేపాతో కలిసి చేస్తున్నదేమిటి?’ అని నిలదీశారు.

జగన్ పై కేసులున్నాయని చెబుతున్న పవన్ అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని గుర్తించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎలాంటి కేసులు లేని పవన్ బీజేపీని ఇప్పటివరకు ఒక్కసారైనా ప్రశ్నించారా? అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రం ఏ రకంగా వెనక్కి వెళ్లిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం తప్పులు మీకు కన్పించడం లేదా? అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు. నిజాయతీ రాజకీయాలు చేయాలన్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.