Skip to main content

కేసీఆర్ కు తెలియని బ్రాండ్లా... జగన్ తో మాట్లాడింది మద్యం బ్రాండ్ల గురించే!: పంచుమర్తి అనురాధ విసుర్లు

ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించారు. రూ.50, రూ.60 ఉన్న మద్యం సీసాలపై రూ.250 పెంచితే రాష్ట్రంలో మద్యం మాఫియా పెరగదా అని నిలదీశారు. ఓ బాటిల్ పై ఏకంగా రూ.250 పెంచడం అంటే నిరుపేదలను దోపిడీ చేయడమేనని అన్నారు. నిషేధం ముసుగులో మద్యం తయారీదారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

"ప్రజలు ఏ బ్రాండు తాగాలో జగన్ చెబుతారంట! ఏ బ్రాండు తాగాలో మీకెందుకు? ఉద్యోగ కల్పన చేయాల్సిన ముఖ్యమంత్రి బ్రాండ్లు నిర్ణయించడమేంటి? ఆ బ్రాండ్ల ముసుగులో రూ.2000 కోట్లు దోచేస్తారా? మొన్న కేసీఆర్, జగన్ గంటల కొద్దీ చర్చించింది బయటపెట్టలేదు, కానీ ఇప్పుడర్థమవుతోంది ఇద్దరూ మాట్లాడుకుంది బ్రాండ్ల గురించేనని. ఎందుకంటే కేసీఆర్ కు ఏ బ్రాండైనా తెలుసు. ఏ బ్రాండ్ కు ఎంతొస్తుంది? ఏ బ్రాండ్ ఏ కంపెనీ అమ్ముతుంది? మనకొచ్చే లాభమెంత? మన జేబులో ఎంత వేసుకోవచ్చు?... ఇవీ కేసీఆర్, జగన్ మధ్య జరిగిన చర్చలు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 20 శాతం మద్యనిషేధం చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు, ఎక్కడ మద్య నిషేధం అమలు చేశారో చెప్పాలని పంచుమర్తి నిలదీశారు. ఎన్నికల వేళ ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం అమ్మకాలు పరిమితం చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. మద్యనిషేధం, ప్రొహిబిషన్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతూ, దాని ముసుగులో జే-ట్యాక్స్ అనేది మరొకటి కలిపారని ఆరోపించారు. రూ.2000 కోట్లు దోచుకునేందుకు తెరలేపారని, జీఎస్టీతో కలిసి 6 శాతం ఉంటే, దానికి జే-ట్యాక్స్ కూడా కలిపి రూ.10 మద్యం బాటిల్ ను రూ.250కు పెంచేసి రోజువారీ కూలీలను మరింత దోచుకుంటుంటే దీన్ని మద్యపానం నిషేధం అంటారా? అని నిప్పులు చెరిగారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.