Skip to main content

కేసీఆర్ కు తెలియని బ్రాండ్లా... జగన్ తో మాట్లాడింది మద్యం బ్రాండ్ల గురించే!: పంచుమర్తి అనురాధ విసుర్లు

ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించారు. రూ.50, రూ.60 ఉన్న మద్యం సీసాలపై రూ.250 పెంచితే రాష్ట్రంలో మద్యం మాఫియా పెరగదా అని నిలదీశారు. ఓ బాటిల్ పై ఏకంగా రూ.250 పెంచడం అంటే నిరుపేదలను దోపిడీ చేయడమేనని అన్నారు. నిషేధం ముసుగులో మద్యం తయారీదారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

"ప్రజలు ఏ బ్రాండు తాగాలో జగన్ చెబుతారంట! ఏ బ్రాండు తాగాలో మీకెందుకు? ఉద్యోగ కల్పన చేయాల్సిన ముఖ్యమంత్రి బ్రాండ్లు నిర్ణయించడమేంటి? ఆ బ్రాండ్ల ముసుగులో రూ.2000 కోట్లు దోచేస్తారా? మొన్న కేసీఆర్, జగన్ గంటల కొద్దీ చర్చించింది బయటపెట్టలేదు, కానీ ఇప్పుడర్థమవుతోంది ఇద్దరూ మాట్లాడుకుంది బ్రాండ్ల గురించేనని. ఎందుకంటే కేసీఆర్ కు ఏ బ్రాండైనా తెలుసు. ఏ బ్రాండ్ కు ఎంతొస్తుంది? ఏ బ్రాండ్ ఏ కంపెనీ అమ్ముతుంది? మనకొచ్చే లాభమెంత? మన జేబులో ఎంత వేసుకోవచ్చు?... ఇవీ కేసీఆర్, జగన్ మధ్య జరిగిన చర్చలు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 20 శాతం మద్యనిషేధం చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు, ఎక్కడ మద్య నిషేధం అమలు చేశారో చెప్పాలని పంచుమర్తి నిలదీశారు. ఎన్నికల వేళ ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం అమ్మకాలు పరిమితం చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. మద్యనిషేధం, ప్రొహిబిషన్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతూ, దాని ముసుగులో జే-ట్యాక్స్ అనేది మరొకటి కలిపారని ఆరోపించారు. రూ.2000 కోట్లు దోచుకునేందుకు తెరలేపారని, జీఎస్టీతో కలిసి 6 శాతం ఉంటే, దానికి జే-ట్యాక్స్ కూడా కలిపి రూ.10 మద్యం బాటిల్ ను రూ.250కు పెంచేసి రోజువారీ కూలీలను మరింత దోచుకుంటుంటే దీన్ని మద్యపానం నిషేధం అంటారా? అని నిప్పులు చెరిగారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...