Skip to main content

కేసీఆర్ కు తెలియని బ్రాండ్లా... జగన్ తో మాట్లాడింది మద్యం బ్రాండ్ల గురించే!: పంచుమర్తి అనురాధ విసుర్లు

ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ మీడియా సమావేశంలో విమర్శనాస్త్రాలు సంధించారు. రూ.50, రూ.60 ఉన్న మద్యం సీసాలపై రూ.250 పెంచితే రాష్ట్రంలో మద్యం మాఫియా పెరగదా అని నిలదీశారు. ఓ బాటిల్ పై ఏకంగా రూ.250 పెంచడం అంటే నిరుపేదలను దోపిడీ చేయడమేనని అన్నారు. నిషేధం ముసుగులో మద్యం తయారీదారులకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

"ప్రజలు ఏ బ్రాండు తాగాలో జగన్ చెబుతారంట! ఏ బ్రాండు తాగాలో మీకెందుకు? ఉద్యోగ కల్పన చేయాల్సిన ముఖ్యమంత్రి బ్రాండ్లు నిర్ణయించడమేంటి? ఆ బ్రాండ్ల ముసుగులో రూ.2000 కోట్లు దోచేస్తారా? మొన్న కేసీఆర్, జగన్ గంటల కొద్దీ చర్చించింది బయటపెట్టలేదు, కానీ ఇప్పుడర్థమవుతోంది ఇద్దరూ మాట్లాడుకుంది బ్రాండ్ల గురించేనని. ఎందుకంటే కేసీఆర్ కు ఏ బ్రాండైనా తెలుసు. ఏ బ్రాండ్ కు ఎంతొస్తుంది? ఏ బ్రాండ్ ఏ కంపెనీ అమ్ముతుంది? మనకొచ్చే లాభమెంత? మన జేబులో ఎంత వేసుకోవచ్చు?... ఇవీ కేసీఆర్, జగన్ మధ్య జరిగిన చర్చలు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 20 శాతం మద్యనిషేధం చేశామని చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు, ఎక్కడ మద్య నిషేధం అమలు చేశారో చెప్పాలని పంచుమర్తి నిలదీశారు. ఎన్నికల వేళ ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం అమ్మకాలు పరిమితం చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. మద్యనిషేధం, ప్రొహిబిషన్ అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతూ, దాని ముసుగులో జే-ట్యాక్స్ అనేది మరొకటి కలిపారని ఆరోపించారు. రూ.2000 కోట్లు దోచుకునేందుకు తెరలేపారని, జీఎస్టీతో కలిసి 6 శాతం ఉంటే, దానికి జే-ట్యాక్స్ కూడా కలిపి రూ.10 మద్యం బాటిల్ ను రూ.250కు పెంచేసి రోజువారీ కూలీలను మరింత దోచుకుంటుంటే దీన్ని మద్యపానం నిషేధం అంటారా? అని నిప్పులు చెరిగారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...