Skip to main content

కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందనే వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందన



మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రచార సభలో కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. షోలాపూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో షిండే మాట్లాడుతూ, త్వరలోనే కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనమవుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో పెద్ద చర్చకే దారి తీశాయి.

ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందిస్తూ, షిండే కాంగ్రెస్ పార్టీకి చెందిని వ్యక్తి అని... ఆయన పార్టీ గురించి ఆయన ఏమైనా చెప్పుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం కాదనే విషయాన్ని తాను స్పష్టంగా చెబుతున్నానని తెలిపారు. శరద్ పవార్ క్లారిటీ ఇచ్చిన తర్వాత... షిండే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారా? అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. రెండు పార్టీలు కలిస్తేనే బీజేపీని ఎదుర్కోగలమనే ఉద్దేశంతో షిండే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా? అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...