Skip to main content

ఇంకా పరారీలోనే కూన రవికుమార్... ఆయనింటికి వెళ్లి అల్పాహారం చేసిన చంద్రబాబు!



తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ పునర్మిర్మాణ పనుల్లో బిజీగా ఉంటూ, నేడు శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆయన పార్టీ నేత కూన రవికుమార్ ఇంటికి అల్పాహారం నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో రవికుమార్ లేకపోవడం గమనార్హం. ఇటీవల ప్రభుత్వ అధికారులపై మాటజారిన కేసులో కూన రవికుమార్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ, కోర్టు ఇంకా మంజూరు చేయలేదు. దీంతో ఆయన దాదాపు నెల రోజులుగా ఇంటికి దూరంగా ఉండగా, పోలీసులు పరారీలో ఉన్నారని ప్రకటించి, ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...