Skip to main content

మందుబాబుల రక్తం జగన్ తాగేస్తున్నాడా? ఆనాడు నువ్వేం తాగావు?: చంద్రబాబుపై ఉమ్మారెడ్డి ఫైర్

 



రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం ద్వారా మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడంటూ సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని హితవు పలికారు.  ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిభ్రమించినట్టుందని అన్నారు. నాడు మహిళల సంక్షేమం కోరి ఎన్టీఆర్ మద్యనిషేధం ప్రకటిస్తే, దాన్ని ఎత్తేసిందెవరో ఓసారి చెప్పండి చంద్రబాబుగారూ అంటూ నిలదీశారు.

మద్యనిషేధం తొలగించడమే కాకుండా, ఫలానా షాపులో ఇంత మేర అమ్మకాలు జరగాలని ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు కూడా ఇచ్చాడని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఆనాడు మద్యాన్ని ఒక ఆదాయవనరుగా చూసినప్పుడు మందుబాబుల రక్తాన్ని తాగుతున్నట్టు అనిపించలేదా? మరి ఆనాడు నువ్వు తాగింది రక్తమా? మంచి నీళ్లా? అని ప్రశ్నించారు.

"అప్పట్లో ఆదాయం వస్తుంటే నీ కళ్లు బైర్లు కమ్మాయి. కానీ జగన్ మేనిఫెస్టోలో పెట్టి మరీ మద్య నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేయాలని నిశ్చయించాడు. జగన్ చెప్పి చేస్తున్నాడు. కానీ నువ్వు చెప్పకుండా వాళ్ల రక్తాన్ని పీల్చేశావ్. అలాంటి నువ్వు ఇవాళ జగన్ మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడని అనడం సరికాదు" అంటూ హితవు పలికారు.

"పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళితే రూ.7500 కోట్లు నష్టం వస్తుందని అంటున్నావు. నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఏమైంది. గతంలో కంటే ఈసారి రూ.840 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిందని తేలింది. నువ్వేదో కాకి లెక్కలతో నోరేసుకుని మాట్లాడితే సరిపోదు. గతంలో టెండర్లు ఎక్కువ వేశారంటే అందులో నీకు పర్సంటేజి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ వేశారు. ఈ ప్రభుత్వ హయాంలో తక్కువకే టెండర్లు వేశారంటే ఎలాంటి పర్సంటేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. సింపుల్ లాజిక్!" అంటూ ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...