Skip to main content

మందుబాబుల రక్తం జగన్ తాగేస్తున్నాడా? ఆనాడు నువ్వేం తాగావు?: చంద్రబాబుపై ఉమ్మారెడ్డి ఫైర్

 



రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం ద్వారా మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడంటూ సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని హితవు పలికారు.  ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు మతిభ్రమించినట్టుందని అన్నారు. నాడు మహిళల సంక్షేమం కోరి ఎన్టీఆర్ మద్యనిషేధం ప్రకటిస్తే, దాన్ని ఎత్తేసిందెవరో ఓసారి చెప్పండి చంద్రబాబుగారూ అంటూ నిలదీశారు.

మద్యనిషేధం తొలగించడమే కాకుండా, ఫలానా షాపులో ఇంత మేర అమ్మకాలు జరగాలని ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు కూడా ఇచ్చాడని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఆనాడు మద్యాన్ని ఒక ఆదాయవనరుగా చూసినప్పుడు మందుబాబుల రక్తాన్ని తాగుతున్నట్టు అనిపించలేదా? మరి ఆనాడు నువ్వు తాగింది రక్తమా? మంచి నీళ్లా? అని ప్రశ్నించారు.

"అప్పట్లో ఆదాయం వస్తుంటే నీ కళ్లు బైర్లు కమ్మాయి. కానీ జగన్ మేనిఫెస్టోలో పెట్టి మరీ మద్య నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేయాలని నిశ్చయించాడు. జగన్ చెప్పి చేస్తున్నాడు. కానీ నువ్వు చెప్పకుండా వాళ్ల రక్తాన్ని పీల్చేశావ్. అలాంటి నువ్వు ఇవాళ జగన్ మందుబాబుల రక్తాన్ని తాగుతున్నాడని అనడం సరికాదు" అంటూ హితవు పలికారు.

"పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళితే రూ.7500 కోట్లు నష్టం వస్తుందని అంటున్నావు. నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం ఏమైంది. గతంలో కంటే ఈసారి రూ.840 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిందని తేలింది. నువ్వేదో కాకి లెక్కలతో నోరేసుకుని మాట్లాడితే సరిపోదు. గతంలో టెండర్లు ఎక్కువ వేశారంటే అందులో నీకు పర్సంటేజి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ వేశారు. ఈ ప్రభుత్వ హయాంలో తక్కువకే టెండర్లు వేశారంటే ఎలాంటి పర్సంటేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. సింపుల్ లాజిక్!" అంటూ ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...