Skip to main content

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మండిపడ్డ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి

అమరావతి సచివాలయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. 2015 నవంబరు 5న టీడీపీ ప్రభుత్వమే జీవో నెంబరు 97 తీసుకు రాలేదా...
బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసినట్టు మీ అధికారంలో ఏదయినా జీవో వచ్చిందా. చింతపల్లిలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అధికారానికి వచ్చిన వందరోజుల్లోనే జీవో నెంబరు 97 ను ప్రభుత్వం రద్దు చేసింది..

నాలుగు నెలల పాలనలో ప్రజలకు నరకం చూపామని చంద్రబాబు అన్నారు. 
మీకు అయిదేళ్ళు టైం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారో అందరికి తెలుసు.
ఎస్సీ , ఎస్టీ, బిసి, మైనార్టీ లకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత జగన్ ది. మహిళలకు సైతం 50శాతం రిజర్వేషన్లు ఈ సర్కార్ ఇచ్చింది.
సచివాలయ పోస్టులను కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నరు. 
గత అయిదు ఏళ్ళలో ఉద్యోగాలు తీయ్యమని యువత అడిగితే లాఠీ చార్జి చేసారు.
లక్షా 20 వేల ఉద్యోగాలు తీసిన జగన్ ను ఎలా చంద్రబాబు ఎలా విమర్శిస్తారు.

వాలంటీర్లుకు గోనెసంచిలు మోసే ఉద్యోగం ఇచ్చామన్నారు.
ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి వారికి చేరువచేసే వ్యవస్ధ ఇది.
కేవలం అయిదు వేల రూపాయలకు సేవా ద్రుక్పదంతో వారు గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్నారు.
వాలంటీర్ల వ్యవస్ధను కించపరిచేవిధంగా మాటాడడం తగదు.
ఇలా మాటాడే ముందు 40 ఏళ్ళ మీ అనుభవం ఏమయ్యింది. 
చివరకు 23 సీట్లు కు మిమ్మల్ని ప్రజలు తెచ్చారు. ఇలా గే ముందుకు వెళితే ఆ సీట్లు కూడా ఉండవు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...