Skip to main content

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మండిపడ్డ డిప్యూటీ సీఎం పుష్పా శ్రీవాణి

అమరావతి సచివాలయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. 2015 నవంబరు 5న టీడీపీ ప్రభుత్వమే జీవో నెంబరు 97 తీసుకు రాలేదా...
బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసినట్టు మీ అధికారంలో ఏదయినా జీవో వచ్చిందా. చింతపల్లిలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అధికారానికి వచ్చిన వందరోజుల్లోనే జీవో నెంబరు 97 ను ప్రభుత్వం రద్దు చేసింది..

నాలుగు నెలల పాలనలో ప్రజలకు నరకం చూపామని చంద్రబాబు అన్నారు. 
మీకు అయిదేళ్ళు టైం ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారో అందరికి తెలుసు.
ఎస్సీ , ఎస్టీ, బిసి, మైనార్టీ లకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత జగన్ ది. మహిళలకు సైతం 50శాతం రిజర్వేషన్లు ఈ సర్కార్ ఇచ్చింది.
సచివాలయ పోస్టులను కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నరు. 
గత అయిదు ఏళ్ళలో ఉద్యోగాలు తీయ్యమని యువత అడిగితే లాఠీ చార్జి చేసారు.
లక్షా 20 వేల ఉద్యోగాలు తీసిన జగన్ ను ఎలా చంద్రబాబు ఎలా విమర్శిస్తారు.

వాలంటీర్లుకు గోనెసంచిలు మోసే ఉద్యోగం ఇచ్చామన్నారు.
ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి వారికి చేరువచేసే వ్యవస్ధ ఇది.
కేవలం అయిదు వేల రూపాయలకు సేవా ద్రుక్పదంతో వారు గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్నారు.
వాలంటీర్ల వ్యవస్ధను కించపరిచేవిధంగా మాటాడడం తగదు.
ఇలా మాటాడే ముందు 40 ఏళ్ళ మీ అనుభవం ఏమయ్యింది. 
చివరకు 23 సీట్లు కు మిమ్మల్ని ప్రజలు తెచ్చారు. ఇలా గే ముందుకు వెళితే ఆ సీట్లు కూడా ఉండవు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.