Skip to main content

ఆసక్తికరంగా మారిన హర్యానా రాజకీయాలు.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్

హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు కనపడట్లేదు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీ సాయం తీసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. జననాయక్ జనతా పార్టీ, ఐఎన్ఎల్డీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.

కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడుతూ... 'జేజేపీ, ఐఎన్ఎల్డీతో కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం' అని తెలిపారు. భూపిందర్ సింగ్ తో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడారు. మరోవైపు, ఢిల్లీకి రావాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా నుంచి పిలుపువచ్చింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.