ఏపీలోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్ జారీ అయింది. మంగళగిరి
దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్
సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని
ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో
హెచ్చరించింది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment