ఏపీలోని టీడీపీ కార్యాలయం నిర్మాణ సంస్థకు నోటీస్ జారీ అయింది. మంగళగిరి
దగ్గర పోరంబోకు స్థలాన్ని పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్న ఎస్ఆర్ఆర్
సంస్థకు రెవెన్యూ శాఖ నోటీస్ జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆ స్థలాన్ని
ఖాళీ చేయాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో
హెచ్చరించింది.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment