Skip to main content

విశాఖ ర్యాలీకి మద్దతు ఇవ్వండి.. చంద్రబాబుకు ఫోన్ చేసిన పవన్ కల్యాణ్













 
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. ఇసుక సమస్యపై వచ్చే నెల మూడో తేదీన విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. ఇదే విషయమై అంతకుముందు ఏపీ బీజీపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా పవన్ ఫోన్ చేసి ర్యాలీకి మద్దుతు కోరారు. కాగా, చంద్రబాబు-పవన్‌లు ఇసుక అక్రమ రవాణా, కార్మికుల ఆత్మహత్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇసుక సమస్య విషయంలో బాధితుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పినట్టు సమాచారం. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. పవన్ విజ్ఞప్తికి బాబు సానుకూలంగా స్పందించారని సమాచారం.



ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి 


క్రితం ఫోన్ చేశారు. ఇసుక సమస్యపై వచ్చే నెల మూడో తేదీన విశాఖపట్టణంలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. ఇదే విషయమై అంతకుముందు ఏపీ బీజీపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా పవన్ ఫోన్ చేసి ర్యాలీకి మద్దుతు కోరారు. కాగా, చంద్రబాబు-పవన్‌లు ఇసుక అక్రమ రవాణా, కార్మికుల ఆత్మహత్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇసుక సమస్య విషయంలో బాధితుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ చెప్పినట్టు సమాచారం. ఇరువురు నేతలు దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. పవన్ విజ్ఞప్తికి బాబు సానుకూలంగా స్పందించారని సమాచారం.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.