Skip to main content

మోదీతో జగన్‌ భేటీ



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. జగన్ కంటె ఒక రోజు ముందుగానె తెలంగాణా సీఎం కేసీఆర్ మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 04.30కి మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై దాదాపు 45 నిమిషాలు చర్చించారు.
ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు. అలాగే పోవలవరానికి సంబంధించిన పెండిగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఇంకా విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు.
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం తదితర విషయాలపై ప్రధానితో సమావేశంలో చర్చించినట్లు సమాచారం.రివర్స్ టెండరింగ్ , పీపీఏలు ఇతర ఒప్పందాలపై తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.
రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు. అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారంలాంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జగన్ విన్నపాలపై మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...