Skip to main content

మోదీతో జగన్‌ భేటీ



ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. జగన్ కంటె ఒక రోజు ముందుగానె తెలంగాణా సీఎం కేసీఆర్ మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన సాయంత్రం 04.30కి మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై దాదాపు 45 నిమిషాలు చర్చించారు.
ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు. అలాగే పోవలవరానికి సంబంధించిన పెండిగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఇంకా విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమతో పాటు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు.
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం తదితర విషయాలపై ప్రధానితో సమావేశంలో చర్చించినట్లు సమాచారం.రివర్స్ టెండరింగ్ , పీపీఏలు ఇతర ఒప్పందాలపై తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.
రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు. అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారంలాంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జగన్ విన్నపాలపై మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...