Skip to main content

ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం.. మరో కీలక ముందడుగు వేసిన జగన్ సర్కార్..


వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయనుంది.

ఆర్టీసీ విలీన ప్రక్రియను ఏపీ సర్కార్ వేగవంతం చేసింది. విలీన ప్రక్రియను పూర్తి చేసేందు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థిక,రవాణ,జీఏడీ,న్యాయశాఖలకు సంబంధించిన ఏడుగురు ఉన్నతాధికారులను గ్రూప్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ ఏర్పాటు,డిజిగ్నేషన్లు,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయనుంది. వర్కింగ్ గ్రూప్ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం విలీనంపై తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా,ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా కార్మికుల నుంచి వినిపిస్తోంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే విలీనంపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం,నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.