Skip to main content

ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం.. మరో కీలక ముందడుగు వేసిన జగన్ సర్కార్..


వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయనుంది.

ఆర్టీసీ విలీన ప్రక్రియను ఏపీ సర్కార్ వేగవంతం చేసింది. విలీన ప్రక్రియను పూర్తి చేసేందు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థిక,రవాణ,జీఏడీ,న్యాయశాఖలకు సంబంధించిన ఏడుగురు ఉన్నతాధికారులను గ్రూప్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే నెల 15వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్‌ను ఆదేశించింది. ప్రజా రవాణాశాఖ ఏర్పాటు,డిజిగ్నేషన్లు,పోస్టులు,పేస్కేల్ విధి విధానాలపై వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలు సిద్దం చేయనుంది. వర్కింగ్ గ్రూప్ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం విలీనంపై తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా,ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా కార్మికుల నుంచి వినిపిస్తోంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే విలీనంపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం,నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...