Skip to main content

చంద్రబాబు కొడుకు... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఛీత్కరించినా, మాడు పగలకొట్టినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గాడితప్పిన వ్యవస్థలను సీఎం జగన్ సరిచేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌ను రౌడీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడంపై కొలుసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడడమే ఉన్మాదమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం సైకోలా కనిపిస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా కనీసం 10 వేల ఉద్యోగాలిచ్చావా అని ప్రశ్నించారు. పింఛన్లు ఇంటి వద్దనే అందజేస్తామంటే తప్పుగా కనిపిస్తోందా అని నిలదీశారు. ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని పార్థసార్థి మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.