Skip to main content

చంద్రబాబు కొడుకు... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఛీత్కరించినా, మాడు పగలకొట్టినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గాడితప్పిన వ్యవస్థలను సీఎం జగన్ సరిచేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌ను రౌడీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడంపై కొలుసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడడమే ఉన్మాదమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం సైకోలా కనిపిస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా కనీసం 10 వేల ఉద్యోగాలిచ్చావా అని ప్రశ్నించారు. పింఛన్లు ఇంటి వద్దనే అందజేస్తామంటే తప్పుగా కనిపిస్తోందా అని నిలదీశారు. ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని పార్థసార్థి మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...