Skip to main content

చంద్రబాబు కొడుకు... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఛీత్కరించినా, మాడు పగలకొట్టినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకోకుండా అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గాడితప్పిన వ్యవస్థలను సీఎం జగన్ సరిచేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌ను రౌడీ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడంపై కొలుసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని కాపాడడమే ఉన్మాదమా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినందుకు సీఎం సైకోలా కనిపిస్తున్నారా అంటూ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా కనీసం 10 వేల ఉద్యోగాలిచ్చావా అని ప్రశ్నించారు. పింఛన్లు ఇంటి వద్దనే అందజేస్తామంటే తప్పుగా కనిపిస్తోందా అని నిలదీశారు. ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని పార్థసార్థి మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.