Skip to main content

రేపు కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై విహరించనున్న అమ్మవారు

             

 రేపు కృష్ణమ్మ ఒడిలో హంస వాహనంపై విహరించనున్న అమ్మవారు
విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రేపు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లు జల విహారం చేయ‌నున్నారు. ఇవాళ కృష్ణానది లో నిర్వహించిన తెప్ఫోత్సవ ట్రైల్ రన్ సక్సెస్ కావడంతో రేపటి ఆది దంపతుల విహారంకు మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ప‌లువురు క్రింది స్థాయి ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసారు. దీంతో పున్నమిఘాట్, ప్రకాశం బ్యారేజి, సీతానగరం ప్రాంతాల నుంచి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు దుర్గాఘాట్ లో ఫ్లై ఓవర్ పనులతో విఐపి పాస్ ల కుదించాల‌ని నిర్ణ‌యించిన అధికారులు కేవలం వెయ్యి పాస్ లు మాత్రమే జారీ చేసారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.