Skip to main content

ధర్మాడి సత్యంకు రాసిన లేఖలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారా?: చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం

 
గోదావరిలో మునిగిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యంకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శించారు. దీనిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోటు వెలికితీసిన ధర్మాడిని టీడీపీ సన్మానించాల్సింది పోయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తారా అని ఈ లేఖలో ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబుకు మతిపోయినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి తమ కాకినాడలో వుండటాన్ని గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. బోటు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని విమర్శించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన వరి పొలాలను అధికారులతో కలిసి కన్నబాబు పరిశీలించారు. కరప మండలం వేములవాడ, వాకాడ గ్రామంలోని పొలాలను పరిశీలించారు. తమకు జరిగిన నష్టం గురించి మంత్రికి చెప్పిన కౌలు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.