Skip to main content

రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయించాం: జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి


టీఎస్సార్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. అనంతరం, మీడియాతో జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయించామని, అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజా రవాణాను కాపాడుకునేందుకే సమ్మెకు దిగామని, ఎల్లుండి అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన నిర్వహిస్తామని, అన్ని ఉద్యోగ సంఘాలు తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, సమ్మెకు మద్దతుగా ఉండాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు రేపు లేఖలు అందజేస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, పార్టీలు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. రేపు, ఎల్లుండి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి పాల్గొని తమ నిరసన తెలిపాలని కోరారు.

సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు మద్దతుగా తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలంగాణ సీపీఐ  కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని కోరారు. కాగా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించనున్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...