Skip to main content

ఎస్వీఆర్ ఉండుంటే శ‌భాష్ అనేవారు : చిరంజీవి


తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ``ఎస్‌.వి.రంగ‌రావుగారు నా అభిమాన న‌టుడు. ఆయ‌న‌తో మా తండ్రీగారికి న‌టించే అవ‌కాశం ద‌క్కింది. నాన్న‌గారు ఆయ‌న న‌ట‌నా కౌశ‌లం గురించి నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయ‌న న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ కార‌ణంగానే ఇప్ప‌టికీ అంద‌రి మ‌దిలో నిలిచిపోయారు. ఆయ‌న న‌ట‌నలోని గొప్ప‌ద‌నం వ‌ల్లే ఆయ‌న‌కు జ‌కార్తా అవార్డు వ‌చ్చింది. అలాగే ఆయ‌న న‌టుడిగా ఇచ్చిన‌ స్ఫూర్తితోనే నేను మ‌ద్రాసుకు వెళ్లాను. ఏడాది నుండి ఈ జిల్లాకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ఇప్ప‌టికి కుదిరింది. న‌న్ను మీ బిడ్డ‌గా ఆద‌రిస్తున్నాను. అక్కున చేర్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఓ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను సినిమాగా చేశాను. ఆ సినిమాను అంద‌రూ ఆద‌రిస్తున్నారు. య‌స్‌.వి.రంగారావుగారు ఉండుంటే శ‌భాష్ అని న‌న్ను మెచ్చుకుని ఉండేవారు`` అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంట్ స‌భ్యుడు ర‌ఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడి కొండ‌ల మాణిక్యాల రావు, వ‌ట్టి వ‌సంత‌కుమార్, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, వాసుబాబు, ఎం.ఎల్‌.సి ఆర్ సూర్యారావు, ఏలూరు మాజీ ఎం.ఎల్‌.ఎ బడేటి బుజ్జి , రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...