Skip to main content

ఎస్వీఆర్ ఉండుంటే శ‌భాష్ అనేవారు : చిరంజీవి


తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ``ఎస్‌.వి.రంగ‌రావుగారు నా అభిమాన న‌టుడు. ఆయ‌న‌తో మా తండ్రీగారికి న‌టించే అవ‌కాశం ద‌క్కింది. నాన్న‌గారు ఆయ‌న న‌ట‌నా కౌశ‌లం గురించి నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయ‌న న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ కార‌ణంగానే ఇప్ప‌టికీ అంద‌రి మ‌దిలో నిలిచిపోయారు. ఆయ‌న న‌ట‌నలోని గొప్ప‌ద‌నం వ‌ల్లే ఆయ‌న‌కు జ‌కార్తా అవార్డు వ‌చ్చింది. అలాగే ఆయ‌న న‌టుడిగా ఇచ్చిన‌ స్ఫూర్తితోనే నేను మ‌ద్రాసుకు వెళ్లాను. ఏడాది నుండి ఈ జిల్లాకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ఇప్ప‌టికి కుదిరింది. న‌న్ను మీ బిడ్డ‌గా ఆద‌రిస్తున్నాను. అక్కున చేర్చుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఓ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను సినిమాగా చేశాను. ఆ సినిమాను అంద‌రూ ఆద‌రిస్తున్నారు. య‌స్‌.వి.రంగారావుగారు ఉండుంటే శ‌భాష్ అని న‌న్ను మెచ్చుకుని ఉండేవారు`` అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంట్ స‌భ్యుడు ర‌ఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పైడి కొండ‌ల మాణిక్యాల రావు, వ‌ట్టి వ‌సంత‌కుమార్, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, వాసుబాబు, ఎం.ఎల్‌.సి ఆర్ సూర్యారావు, ఏలూరు మాజీ ఎం.ఎల్‌.ఎ బడేటి బుజ్జి , రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...