Skip to main content

చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?

 
చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ?
 దుశ్యంత్‌ చౌటాలా ఎవరు?.. మాజీ ఉపప్రధాని చౌదరీ దేవీలాల్‌ మునిమనవడు.. హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌటాలా మనవడు.. మాజీ ఎంపీ.. ఇప్పటివరకు తెలిసిందిదే.. కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనో కింగ్‌ మేకర్‌..! ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పే కీలక నాయకుడు.. ‘చౌటాలా.. చౌటాలా.. నువ్వెక్కడ’ అంటూ ప్రధాన పార్టీలు ఆత్రుతగా వెతుకుతున్న సరికొత్త ‘హంగ్‌ కింగ్‌’.
రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితం హంగ్‌ దిశగా సాగుతోంది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నా.. రెండు పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం దక్కే అవకాశాలు కన్పించట్లేదు. దీంతో ఇరు పార్టీల చూపు  చౌటాలా నాయకత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)పై పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కోసం భాజపా, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఆయన మద్దతు కోరుతున్నాయి.
రంగంలోకి కేంద్ర నేతలు..
ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తారుమారవడంతో భాజపా, కాంగ్రెస్‌ కేంద్ర నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫలితాలు సంక్లిష్టంగా ఉండటంతో  భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా.. సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను దిల్లీకి పిలిచారు. మరోవైపు భాజపా తన మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ పెద్దలను జేజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు పంపింది. 
అటు కాంగ్రెస్‌ కూడా వ్యూహాలు రచిస్తోంది. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌నేత, మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హుడాతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.
దుశ్యంత్‌కు సీఎం పదవి..?
కాంగ్రెస్‌ మరో అడుగు ముందుకేసి చౌటాలాకు సీఎం పదవి ఇస్తామని ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిసింది. గతంలో కర్ణాటక మాదిరిగా హరియాణాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది హస్తం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం పదవి ఎవరిస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని అంతకుముందు చెప్పిన దుశ్యంత్‌.. ఇప్పుడు మాత్రం తుది ఫలితం వచ్చాకే తన నిర్ణయం వెల్లడిస్తానని అంటున్నారు. ఈ నేపథ్యంలో హరియాణాలో భాజపా మరోసారి గద్దెనెక్కాలన్నా లేదా హస్తం పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నా.. అది ‘ఛోటా చౌటాలా’పైనే ఆధారపడి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...