Skip to main content

పోలవరం నిధులు .. వెనక్కి.. సీఎం ఢిల్లీకి..


నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరో సారి పోలవరం అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల కోసం సిద్ధమై, రాష్ట్ర ఖజానాకు చేరడం ఖాయమని భావించిన 3 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం నిలిపివేసింది. రాష్ట్ర ఆర్థికస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఈ మొత్తం విడుదలైతే కొంతమేరకైనా ఊరట లభిస్తుందని ఆర్థికశాఖ భావించింది. అనూహ్యంగా దానికి సంబంధించిన ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం అధికారయంత్రాం గాన్ని విస్మయపరిచింది. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శనివారం ప్రధాని మోడీతో జరగనున్న భేటీలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చినా, రాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై పూర్తి వివరాలతో ఒక లేఖ రాయాలని ఆర్థికశాఖ అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పర్యవేక్షిస్తున్న పోలవరం అథారిటీకి కేంద్రం నురచి దాదాపు ఆరు వేల కోట్ల వరకు పాత బకాయిలు కేంద్రం నురచి రావాల్సి ఉరది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కేంద్రంతో సంప్రదిరపులు జరుపుతూనే ఉరది. ఈ నిధుల్లో దాదాపు మూడు వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సిధ్దమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు కూడా జలశక్తి శాఖ నుండి కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లినట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజల్లో నిధులు విడుదల అవుతాయని భావిస్తుండగా, ఆ ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. వివిధ పనులకు సంబంధిరచిన టెరడర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రానికి ఇష్టం లేదు. ఈ జాబితాలో పోలవరం కూడా ఉంది. దీనికి సంబంధించిన వివాదం న్యాయ స్థానంలో ఉండటంతో నిధులను ఇఫ్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. నవయుగకు కేటాయించిన పోలవరం టెండర్‌ రద్దు పట్ల ప్రాజెక్టు అథారిటీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్త ంచేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కూడా నిధులు నిలిపివేతకు కారణమని అంటున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...