Skip to main content

పోలవరం నిధులు .. వెనక్కి.. సీఎం ఢిల్లీకి..


నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరో సారి పోలవరం అంశం తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు పనుల కోసం సిద్ధమై, రాష్ట్ర ఖజానాకు చేరడం ఖాయమని భావించిన 3 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం నిలిపివేసింది. రాష్ట్ర ఆర్థికస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఈ మొత్తం విడుదలైతే కొంతమేరకైనా ఊరట లభిస్తుందని ఆర్థికశాఖ భావించింది. అనూహ్యంగా దానికి సంబంధించిన ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం అధికారయంత్రాం గాన్ని విస్మయపరిచింది. దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శనివారం ప్రధాని మోడీతో జరగనున్న భేటీలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చినా, రాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై పూర్తి వివరాలతో ఒక లేఖ రాయాలని ఆర్థికశాఖ అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పర్యవేక్షిస్తున్న పోలవరం అథారిటీకి కేంద్రం నురచి దాదాపు ఆరు వేల కోట్ల వరకు పాత బకాయిలు కేంద్రం నురచి రావాల్సి ఉరది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా కేంద్రంతో సంప్రదిరపులు జరుపుతూనే ఉరది. ఈ నిధుల్లో దాదాపు మూడు వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సిధ్దమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు కూడా జలశక్తి శాఖ నుండి కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లినట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజల్లో నిధులు విడుదల అవుతాయని భావిస్తుండగా, ఆ ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. వివిధ పనులకు సంబంధిరచిన టెరడర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్రానికి ఇష్టం లేదు. ఈ జాబితాలో పోలవరం కూడా ఉంది. దీనికి సంబంధించిన వివాదం న్యాయ స్థానంలో ఉండటంతో నిధులను ఇఫ్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. నవయుగకు కేటాయించిన పోలవరం టెండర్‌ రద్దు పట్ల ప్రాజెక్టు అథారిటీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్త ంచేసిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కూడా నిధులు నిలిపివేతకు కారణమని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...