Skip to main content

ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం

సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణను
అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, సేవలకు ఆన్ లైన్ లో టెండర్లు పిలిచేలా కొత్త విధానం రూపకల్పన చేశారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలు చేసేలా కార్యాచరణకు దిగనుంది. ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లన్నీ ఈ-ప్లాట్ ఫాం వేదికగానే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, అన్ని ప్రభుత్వ శాఖల కొనుగోళ్లకు ఏకరూప విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. ప్రతి ఏటా సామగ్రి కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు, సేవలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుతం ఇ-ప్రొక్యూర్ మెంట్ లో రూ.3,181 కోట్ల మేర కొనుగోలు చేస్తున్నట్టు, టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నట్టు, నాసిరకం సామగ్రి సరఫరా అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొనుగోళ్లు, చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.