Skip to main content

ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం

సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణను
అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో కొనుగోళ్లు, సేవలకు ఆన్ లైన్ లో టెండర్లు పిలిచేలా కొత్త విధానం రూపకల్పన చేశారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలు చేసేలా కార్యాచరణకు దిగనుంది. ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లన్నీ ఈ-ప్లాట్ ఫాం వేదికగానే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, అన్ని ప్రభుత్వ శాఖల కొనుగోళ్లకు ఏకరూప విధానాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. ప్రతి ఏటా సామగ్రి కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు, సేవలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ప్రస్తుతం ఇ-ప్రొక్యూర్ మెంట్ లో రూ.3,181 కోట్ల మేర కొనుగోలు చేస్తున్నట్టు, టెండర్లు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నట్టు, నాసిరకం సామగ్రి సరఫరా అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొనుగోళ్లు, చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఇ-ప్రొక్యూర్ మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...