Skip to main content

రైలు ఆలస్యమైతే పరిహారం... రైల్వేమంత్రి సంచలన ప్రకటన.















భారత రైల్వే ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-లక్నో మధ్య నూతనంగా ప్రారంభం కానున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి రైలు ఆలస్యమైతే పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. రైలు గంట ఆలస్యమైతే ప్రయాణికులకు రూ.100 రూపాయలు, 2 గంటలు ఆపైన ఆలస్యానికి రూ.250 చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.  
అంతేకాదు.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా ఐఆర్‌సీటీసీ అందించనుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికుల వస్తువులు చోరీకి గురైనా, దోపిడీ జరిగినా ఇదే ప్రయాణ బీమా ద్వారా రూ.లక్ష వరకు పరిహారమిచ్చే అవకాశం కూడా ఉంది. తాజా నిర్ణయంతో రైలు ఆలస్యానికి పరిహారం చెల్లించే తొలి రైలుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోనుంది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...