Skip to main content

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?

             

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?
ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకు రానున్న రైతు భ‌రోసాలో ఒక రైతు త‌న‌కున్న భూమిని ఎంత‌మందికి కౌలుకు ఇచ్చినా కేవ‌లం ఒక రైతుకు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించ‌డంపై రైతు సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఇది కౌలు రైతుల‌ను దెబ్బ‌తీసి, ప‌థ‌కం నుంచి త‌ప్పించ‌డ‌మేన‌ని పేర్కొన్నాయి. భూయ‌జ‌మానుల క‌న్నా కౌలు రైతులే ఏపిలో ఎక్కువ‌గా ఉన్న విష‌యాన్ని ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌కు నెట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.
రైతు భ‌రోసా క్రింద 12500 పెట్టుబ‌డి సాయంగా అందించాల‌ని జ‌గ‌న్ ఇచ్చిన హామీని అమ‌లు చేస్తూ నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. అయితే ఇందులో ప్ర‌ధాని కిసాన్‌స‌మ్మాన్ క్రింద రైతుల‌కు 6000 కేవ‌ద్ర సాయం అందుతుండ‌టంతో దానికి మ‌రి 6500 మాత్ర‌మే క‌లిపి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే భూమ‌లేని కౌలు రైతుల‌కు రూ. 12500 అందిస్తామ‌ని ప్ర‌భుత్వం చెపినా తాజా నిబంధ‌న‌లతో ఆ సాయం హుళ‌క్కే అనిపిస్తోంది.  ఎందుకంటే కౌలు ఒప్పంద ప‌త్రాలు ఖ‌చ్చితం అన్న నిబంధ‌నే కార‌ణంగా క‌నిపిస్తోంది. కౌలుకు ఇచ్చేవారు దాదాపు రాత కోత‌ల‌కు దూరంగా ఉంటార‌ని, ఈ స్థితిలో పత్రాలెక్క‌డి నుంచి వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న కౌలు రైతుల నుంచి వినిపిస్తోంది.
ఇక కిసాన్ స‌మ్మాన్‌పై విచార‌ణ చేసిన ప్ర‌భుత్వం ఆధార్ ఆధారం చేసుకుని అనేక మందిపై వేటు వేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కున్న భూముల‌కు రైతు భ‌రోసా అంద‌కుండా పోయేలా ఉంద‌ని, ఉద్యోగులు త‌మ‌కున్న భూములు దాదాపు కౌలుకే ఇస్తార‌ని రైతు సంఘాల వాద‌న‌.
మ‌రోవైపు రైతు భ‌రోసా క్రింద  85ల‌క్ష‌ల మంది రైతులు న‌మోదు చేసుకోగా వారిలో దాదాపు50 ల‌క్ష‌ల కుటుంబాల‌ని గుర్తించారు. మ‌రి 3 వేల కుటుంబాలు ప‌రిశీలిన‌లో ఉండ‌గా, ఆరు ల‌క్ష‌ల మంది పైచిలుకు రైతు కుటుంబాల వివ‌రాలు అందుబాటులో లేవ‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం వీరిలో సోమ‌వారం వ‌ర‌కు లో ఇప్ప‌టి వ‌ర‌కు  40 వేల మంది కౌలు రైతుల‌కు మాత్ర‌మే పంట‌సాగుదారుల ఒప్పంద ప్ర‌తాలు రిజిస్ట్రేష‌న్ శాఖ అందించింది.  ఇక అట‌వీ చ‌ట్టం ప్ర‌కారం 61 వేల పైచిలుకు గిరిజ‌నులున్న‌ట్టు తెలుస్తోంది.

అలాగే 7ల‌క్ష‌ల మంది భూ య‌జ‌మానులు మ‌ర‌ణించార‌ని, వారి వార‌సులు త‌గిన ఆధారాల‌తో భూమిని త‌మ ప‌పేరున మార్చుకుంటే రైతు భ‌రోసా అందుతుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు చెపుతున్నారు. ఏదిఏమైనా ఈ నెల 15న ఆరంభం కానున్న ఈ కార్య‌క్ర‌మం ఒడిదుడుకులు అధిగ‌మించి రైతాంగానికి బాస‌ట‌గా నిల‌వాల‌ని జ‌నం కోరుకుంటున్నా

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...