Skip to main content

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?

             

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?
ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకు రానున్న రైతు భ‌రోసాలో ఒక రైతు త‌న‌కున్న భూమిని ఎంత‌మందికి కౌలుకు ఇచ్చినా కేవ‌లం ఒక రైతుకు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించ‌డంపై రైతు సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఇది కౌలు రైతుల‌ను దెబ్బ‌తీసి, ప‌థ‌కం నుంచి త‌ప్పించ‌డ‌మేన‌ని పేర్కొన్నాయి. భూయ‌జ‌మానుల క‌న్నా కౌలు రైతులే ఏపిలో ఎక్కువ‌గా ఉన్న విష‌యాన్ని ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌కు నెట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.
రైతు భ‌రోసా క్రింద 12500 పెట్టుబ‌డి సాయంగా అందించాల‌ని జ‌గ‌న్ ఇచ్చిన హామీని అమ‌లు చేస్తూ నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. అయితే ఇందులో ప్ర‌ధాని కిసాన్‌స‌మ్మాన్ క్రింద రైతుల‌కు 6000 కేవ‌ద్ర సాయం అందుతుండ‌టంతో దానికి మ‌రి 6500 మాత్ర‌మే క‌లిపి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే భూమ‌లేని కౌలు రైతుల‌కు రూ. 12500 అందిస్తామ‌ని ప్ర‌భుత్వం చెపినా తాజా నిబంధ‌న‌లతో ఆ సాయం హుళ‌క్కే అనిపిస్తోంది.  ఎందుకంటే కౌలు ఒప్పంద ప‌త్రాలు ఖ‌చ్చితం అన్న నిబంధ‌నే కార‌ణంగా క‌నిపిస్తోంది. కౌలుకు ఇచ్చేవారు దాదాపు రాత కోత‌ల‌కు దూరంగా ఉంటార‌ని, ఈ స్థితిలో పత్రాలెక్క‌డి నుంచి వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న కౌలు రైతుల నుంచి వినిపిస్తోంది.
ఇక కిసాన్ స‌మ్మాన్‌పై విచార‌ణ చేసిన ప్ర‌భుత్వం ఆధార్ ఆధారం చేసుకుని అనేక మందిపై వేటు వేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కున్న భూముల‌కు రైతు భ‌రోసా అంద‌కుండా పోయేలా ఉంద‌ని, ఉద్యోగులు త‌మ‌కున్న భూములు దాదాపు కౌలుకే ఇస్తార‌ని రైతు సంఘాల వాద‌న‌.
మ‌రోవైపు రైతు భ‌రోసా క్రింద  85ల‌క్ష‌ల మంది రైతులు న‌మోదు చేసుకోగా వారిలో దాదాపు50 ల‌క్ష‌ల కుటుంబాల‌ని గుర్తించారు. మ‌రి 3 వేల కుటుంబాలు ప‌రిశీలిన‌లో ఉండ‌గా, ఆరు ల‌క్ష‌ల మంది పైచిలుకు రైతు కుటుంబాల వివ‌రాలు అందుబాటులో లేవ‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం వీరిలో సోమ‌వారం వ‌ర‌కు లో ఇప్ప‌టి వ‌ర‌కు  40 వేల మంది కౌలు రైతుల‌కు మాత్ర‌మే పంట‌సాగుదారుల ఒప్పంద ప్ర‌తాలు రిజిస్ట్రేష‌న్ శాఖ అందించింది.  ఇక అట‌వీ చ‌ట్టం ప్ర‌కారం 61 వేల పైచిలుకు గిరిజ‌నులున్న‌ట్టు తెలుస్తోంది.

అలాగే 7ల‌క్ష‌ల మంది భూ య‌జ‌మానులు మ‌ర‌ణించార‌ని, వారి వార‌సులు త‌గిన ఆధారాల‌తో భూమిని త‌మ ప‌పేరున మార్చుకుంటే రైతు భ‌రోసా అందుతుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు చెపుతున్నారు. ఏదిఏమైనా ఈ నెల 15న ఆరంభం కానున్న ఈ కార్య‌క్ర‌మం ఒడిదుడుకులు అధిగ‌మించి రైతాంగానికి బాస‌ట‌గా నిల‌వాల‌ని జ‌నం కోరుకుంటున్నా

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.