Skip to main content

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?

             

రైతు భ‌రోసా స‌రే.... ఈ లెక్కేంటి?
ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకు రానున్న రైతు భ‌రోసాలో ఒక రైతు త‌న‌కున్న భూమిని ఎంత‌మందికి కౌలుకు ఇచ్చినా కేవ‌లం ఒక రైతుకు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించ‌డంపై రైతు సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. ఇది కౌలు రైతుల‌ను దెబ్బ‌తీసి, ప‌థ‌కం నుంచి త‌ప్పించ‌డ‌మేన‌ని పేర్కొన్నాయి. భూయ‌జ‌మానుల క‌న్నా కౌలు రైతులే ఏపిలో ఎక్కువ‌గా ఉన్న విష‌యాన్ని ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ప‌క్క‌కు నెట్టిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.
రైతు భ‌రోసా క్రింద 12500 పెట్టుబ‌డి సాయంగా అందించాల‌ని జ‌గ‌న్ ఇచ్చిన హామీని అమ‌లు చేస్తూ నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. అయితే ఇందులో ప్ర‌ధాని కిసాన్‌స‌మ్మాన్ క్రింద రైతుల‌కు 6000 కేవ‌ద్ర సాయం అందుతుండ‌టంతో దానికి మ‌రి 6500 మాత్ర‌మే క‌లిపి ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అయితే భూమ‌లేని కౌలు రైతుల‌కు రూ. 12500 అందిస్తామ‌ని ప్ర‌భుత్వం చెపినా తాజా నిబంధ‌న‌లతో ఆ సాయం హుళ‌క్కే అనిపిస్తోంది.  ఎందుకంటే కౌలు ఒప్పంద ప‌త్రాలు ఖ‌చ్చితం అన్న నిబంధ‌నే కార‌ణంగా క‌నిపిస్తోంది. కౌలుకు ఇచ్చేవారు దాదాపు రాత కోత‌ల‌కు దూరంగా ఉంటార‌ని, ఈ స్థితిలో పత్రాలెక్క‌డి నుంచి వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న కౌలు రైతుల నుంచి వినిపిస్తోంది.
ఇక కిసాన్ స‌మ్మాన్‌పై విచార‌ణ చేసిన ప్ర‌భుత్వం ఆధార్ ఆధారం చేసుకుని అనేక మందిపై వేటు వేసింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కున్న భూముల‌కు రైతు భ‌రోసా అంద‌కుండా పోయేలా ఉంద‌ని, ఉద్యోగులు త‌మ‌కున్న భూములు దాదాపు కౌలుకే ఇస్తార‌ని రైతు సంఘాల వాద‌న‌.
మ‌రోవైపు రైతు భ‌రోసా క్రింద  85ల‌క్ష‌ల మంది రైతులు న‌మోదు చేసుకోగా వారిలో దాదాపు50 ల‌క్ష‌ల కుటుంబాల‌ని గుర్తించారు. మ‌రి 3 వేల కుటుంబాలు ప‌రిశీలిన‌లో ఉండ‌గా, ఆరు ల‌క్ష‌ల మంది పైచిలుకు రైతు కుటుంబాల వివ‌రాలు అందుబాటులో లేవ‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం వీరిలో సోమ‌వారం వ‌ర‌కు లో ఇప్ప‌టి వ‌ర‌కు  40 వేల మంది కౌలు రైతుల‌కు మాత్ర‌మే పంట‌సాగుదారుల ఒప్పంద ప్ర‌తాలు రిజిస్ట్రేష‌న్ శాఖ అందించింది.  ఇక అట‌వీ చ‌ట్టం ప్ర‌కారం 61 వేల పైచిలుకు గిరిజ‌నులున్న‌ట్టు తెలుస్తోంది.

అలాగే 7ల‌క్ష‌ల మంది భూ య‌జ‌మానులు మ‌ర‌ణించార‌ని, వారి వార‌సులు త‌గిన ఆధారాల‌తో భూమిని త‌మ ప‌పేరున మార్చుకుంటే రైతు భ‌రోసా అందుతుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు చెపుతున్నారు. ఏదిఏమైనా ఈ నెల 15న ఆరంభం కానున్న ఈ కార్య‌క్ర‌మం ఒడిదుడుకులు అధిగ‌మించి రైతాంగానికి బాస‌ట‌గా నిల‌వాల‌ని జ‌నం కోరుకుంటున్నా

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...