Skip to main content

అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?

 
స్పష్టత ఇచ్చిన జీవితా-రాజశేఖర్‌
అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
 ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అత్యవసరంగా సమావేశం కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అంటూ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ జీవిత రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. అయితే, ఈ సమావేశం గురించి వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్‌ స్వయంగా మాట్లాడారు. సమావేశం ఎలా జరిగింది? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టతనిచ్చారు.
‘‘ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు సంబంధించి సమావేశం జరిగింది. దీని గురించి మీడియాలో, వాట్సాప్‌లలో పలు రకాల వార్తలు వచ్చాయి. ఆ సమావేశం జరగలేదని, కోర్టుకు వెళ్లారని, మధ్యలోనే ఆగిపోయిందని, కోర్టును ధిక్కరించి మీటింగ్‌ పెట్టారని, పెద్ద గొడవ జరిగిందని రకరకాల వార్తలు విన్నా. సమస్యల పరిష్కారంపై నిన్నటి ‘మా’ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మేం దీనిపై అధికారికంగా మాట్లాడకపోవడం వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకొన్నారు. అలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయానికి వచ్చా. అసలేం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. ఆదివారం సమావేశం నిర్వహించాలనే దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా దాదాపు 200మంది ‘మా’ సభ్యులు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంది. వారి అందరి అభిప్రాయాలనే నేను మీకు చెబుతున్నా. కొందరు ఈ సమావేశానికి రాలేకపోయారు. వాళ్ల కోసం వివరాలు చెబుతున్నా’’
అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
‘‘ఉదయం 9గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సమావేశం పెట్టాం.  ఈ సందర్భంగా పెట్టిన చర్చలో అందరూ చురుగ్గా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అందరికీ ఉపయోగపడేలా ఈ సమావేశం జరిగింది. ‘మా’వార్షిక సర్వ సభ్య సమావేశం ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో  నిబంధనల ప్రకారం.. వీలైనంత త్వరగా ‘మా’ ఎక్స్‌టార్డనరీ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించాం. ఇందుకోసం న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్నాం. సమస్యల పరిష్కరానికి ప్రత్యేక సమావేశం కావాలంటూ మొత్తం ‘మా’సభ్యుల్లో 20శాతం మంది అభ్యర్థిస్తే సమావేశం నిర్వహించుకోవచ్చని న్యాయ నిపుణులు తెలిపారు. మెజార్టీ అభ్యర్థనలు వచ్చిన 21రోజుల్లో ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశం జరిగితే ‘మా’కు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇందుకు హాజరుకావాలనుకునేవారు ‘మా’ ఆఫీస్‌కు వచ్చి మద్దతు తెలుపుతూ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పోస్ట్‌ ద్వారా లేఖ రాసి ‘మా’కు పంపవచ్చు. మెయిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.