Skip to main content

అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?

 
స్పష్టత ఇచ్చిన జీవితా-రాజశేఖర్‌
అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
 ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అత్యవసరంగా సమావేశం కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అంటూ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ జీవిత రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. అయితే, ఈ సమావేశం గురించి వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్‌ స్వయంగా మాట్లాడారు. సమావేశం ఎలా జరిగింది? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టతనిచ్చారు.
‘‘ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు సంబంధించి సమావేశం జరిగింది. దీని గురించి మీడియాలో, వాట్సాప్‌లలో పలు రకాల వార్తలు వచ్చాయి. ఆ సమావేశం జరగలేదని, కోర్టుకు వెళ్లారని, మధ్యలోనే ఆగిపోయిందని, కోర్టును ధిక్కరించి మీటింగ్‌ పెట్టారని, పెద్ద గొడవ జరిగిందని రకరకాల వార్తలు విన్నా. సమస్యల పరిష్కారంపై నిన్నటి ‘మా’ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మేం దీనిపై అధికారికంగా మాట్లాడకపోవడం వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకొన్నారు. అలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయానికి వచ్చా. అసలేం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. ఆదివారం సమావేశం నిర్వహించాలనే దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా దాదాపు 200మంది ‘మా’ సభ్యులు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంది. వారి అందరి అభిప్రాయాలనే నేను మీకు చెబుతున్నా. కొందరు ఈ సమావేశానికి రాలేకపోయారు. వాళ్ల కోసం వివరాలు చెబుతున్నా’’
అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
‘‘ఉదయం 9గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సమావేశం పెట్టాం.  ఈ సందర్భంగా పెట్టిన చర్చలో అందరూ చురుగ్గా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అందరికీ ఉపయోగపడేలా ఈ సమావేశం జరిగింది. ‘మా’వార్షిక సర్వ సభ్య సమావేశం ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో  నిబంధనల ప్రకారం.. వీలైనంత త్వరగా ‘మా’ ఎక్స్‌టార్డనరీ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించాం. ఇందుకోసం న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్నాం. సమస్యల పరిష్కరానికి ప్రత్యేక సమావేశం కావాలంటూ మొత్తం ‘మా’సభ్యుల్లో 20శాతం మంది అభ్యర్థిస్తే సమావేశం నిర్వహించుకోవచ్చని న్యాయ నిపుణులు తెలిపారు. మెజార్టీ అభ్యర్థనలు వచ్చిన 21రోజుల్లో ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశం జరిగితే ‘మా’కు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇందుకు హాజరుకావాలనుకునేవారు ‘మా’ ఆఫీస్‌కు వచ్చి మద్దతు తెలుపుతూ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పోస్ట్‌ ద్వారా లేఖ రాసి ‘మా’కు పంపవచ్చు. మెయిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...