Skip to main content

అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?

 
స్పష్టత ఇచ్చిన జీవితా-రాజశేఖర్‌
అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
 ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అత్యవసరంగా సమావేశం కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చ నడిచింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది ‘మా’ ఆత్మీయ సమావేశం అంటూ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ జీవిత రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. అయితే, ఈ సమావేశం గురించి వివిధ రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో జీవిత రాజశేఖర్‌ స్వయంగా మాట్లాడారు. సమావేశం ఎలా జరిగింది? ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టతనిచ్చారు.
‘‘ఆదివారం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు సంబంధించి సమావేశం జరిగింది. దీని గురించి మీడియాలో, వాట్సాప్‌లలో పలు రకాల వార్తలు వచ్చాయి. ఆ సమావేశం జరగలేదని, కోర్టుకు వెళ్లారని, మధ్యలోనే ఆగిపోయిందని, కోర్టును ధిక్కరించి మీటింగ్‌ పెట్టారని, పెద్ద గొడవ జరిగిందని రకరకాల వార్తలు విన్నా. సమస్యల పరిష్కారంపై నిన్నటి ‘మా’ సమావేశంలో ఎలాంటి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. మేం దీనిపై అధికారికంగా మాట్లాడకపోవడం వల్ల ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకొన్నారు. అలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయానికి వచ్చా. అసలేం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. ఆదివారం సమావేశం నిర్వహించాలనే దానిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా దాదాపు 200మంది ‘మా’ సభ్యులు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంది. వారి అందరి అభిప్రాయాలనే నేను మీకు చెబుతున్నా. కొందరు ఈ సమావేశానికి రాలేకపోయారు. వాళ్ల కోసం వివరాలు చెబుతున్నా’’
అసలు ‘మా’ సమావేశంలో ఏం జరిగింది?
‘‘ఉదయం 9గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సమావేశం పెట్టాం.  ఈ సందర్భంగా పెట్టిన చర్చలో అందరూ చురుగ్గా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అందరికీ ఉపయోగపడేలా ఈ సమావేశం జరిగింది. ‘మా’వార్షిక సర్వ సభ్య సమావేశం ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో  నిబంధనల ప్రకారం.. వీలైనంత త్వరగా ‘మా’ ఎక్స్‌టార్డనరీ జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించాం. ఇందుకోసం న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్నాం. సమస్యల పరిష్కరానికి ప్రత్యేక సమావేశం కావాలంటూ మొత్తం ‘మా’సభ్యుల్లో 20శాతం మంది అభ్యర్థిస్తే సమావేశం నిర్వహించుకోవచ్చని న్యాయ నిపుణులు తెలిపారు. మెజార్టీ అభ్యర్థనలు వచ్చిన 21రోజుల్లో ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమావేశం జరిగితే ‘మా’కు మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇందుకు హాజరుకావాలనుకునేవారు ‘మా’ ఆఫీస్‌కు వచ్చి మద్దతు తెలుపుతూ సంతకం పెట్టాల్సి ఉంటుంది. పోస్ట్‌ ద్వారా లేఖ రాసి ‘మా’కు పంపవచ్చు. మెయిల్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నా’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం: ఏపీ సర్కారుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో టీడీపీ ఎంపీ కేశినేని నాని నిర్మించిన వసతి భవనాన్ని పేర్ని నాని ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, దేశంలో చాలా వ్యవస్థలు ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో మాత్రం ఒక కార్పొరేషన్ ను సర్కారులో విలీనం చేయడమనేది గొప్ప విషయమని పేర్ని నాని అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఏం జరుగుతుందో ఆరు నెలల్లో చూద్దామని అన్నారని, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వంలో కసి పెరిగిందని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తామని ప్రకటన చేశామని, దాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందని పేర్ని నాని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యను తాము పాజిటివ్ గా తీసుకున్నామని చెప్పారు. కొన్ని నెలల్ల...

ఆ జీవో రద్దు చేయడం దారుణం: అయ్యన్నపాత్రుడు

రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని, ఏ ప్రభుత్వం ఉన్న నడుస్తున్న పథకాలను కొనసాగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ప్రభుత్వం నిన్న రద్దు చేసిన జీవో 38పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అసలు వ్యవసాయం పట్ల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తమ హయాంలో మొత్తం 14,124 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వంద రోజుల తర్వాత కూడా చంద్రబాబు పాలన గురించి మాట్లాడుతున్నారని.. అసలు వైసీపీ పాలన ఏంటో చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.  ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని అంటూ.. వైసీపీ నేతలు తిరిగి విమర్శలు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్దారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాలుకలు, పీకలు కోస్తామని బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే గొంతు పిసికి చంపేస్తారన్నారు. వైసీపీ నేతలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని అయ్యన్న హెచ్చరించారు. అవంతి శ్రీనివాస్ మంచి వ్యక్తి, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్...