Skip to main content

ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ సమీక్ష... ముఖ్యాంశాలు ఇవిగో!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యాంశాలు

  • నవంబరు 1 నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
  • పొరుగు రాష్ట్రాల్లో 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ
  • శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునేంతవరకు నెలకు రూ.5,000 లేదా రోజుకు రూ.225 (డిసెంబరు 1 నుంచి అమలు)
  • కిడ్నీ వ్యాది బాధితులకు నెలకు రూ.5,000
  • తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000
  • పక్షవాతం, కండరాల క్షీణత, కాళ్లుచేతులు లేనివారికి నెలకు రూ. 5 వేలు పెన్షన్ (జనవరి 1 నుంచి అమలు)
  • డెంగ్యూ జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు ఆరోగ్యశ్రీలో స్థానం
  • డబుల్ కాక్లియర్ ఇంప్లాంట్ కు ఆరోగ్యశ్రీలో స్థానం
  • కంటి వెలుగు పథకం కాలేజీలకూ వర్తింపు
  • డిసెంబరు 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
  • ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.16 వేలకు పెంపు
  • జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2000 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
  • ఇతర జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
  • బైకుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు
  • ప్రజలందరికీ కంటి పరీక్షలు
  • ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి ఆసుపత్రి
  • రోడ్డు ప్రమాద బాధితుల కోసం అత్యవసర నిధి ఏర్పాటు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.