Skip to main content

విశాఖ భూ స్కామ్‌లో ఎవర్నీ విడిచిపెట్టాం: అవంతి


విశాఖ భూకుంభకోణంలో ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కుంభకోణంలో టీడీపీ నేతలే ఎక్కువ ఉన్నారన్నారు. దీనిపై సిట్ విచారణ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. కక్ష సాధింపు చర్యలు కావని పేర్కొన్నారు. జిల్లాలో పెద్ద స్థాయిలో ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందన్నారు. టీడీపీ హయంలో సిట్ వేసినప్పుడు బాధ్యులపై ఎందుకు విచారణ జరగలేదని అడిగారు. ఈ సిట్ విచారణ ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్శకంగా ఉంటుందని వివరించారు. ఎప్పుడూ జరగని భూ కుంభకోణం విశాఖలో గత ప్రభుత్వ హయంలో జరిగిందని విమర్శించారు. మద్యం పాలసీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. మద్యాన్ని కట్టడి చేస్తున్న నేపథ్యంలో బయట రాష్ట్రం నుండి మద్యం రాకుండా కట్టడి చేస్తామని తెలిపారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.