Skip to main content

నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను.. నాలుగు నెలల్లోనే హామీ నిలబెట్టుకున్నాను: జగన్

నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నా'నంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా తాను అండగా ఉంటానని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు 'వైయస్సార్ వాహన మిత్ర' పథకాన్ని జగన్ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆటోవాలా చొక్కా వేసుకుని ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర సందర్భంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. ఏలూరులోనే ఈ హామీని ఇచ్చానని, ఇప్పుడు ఏలూరులోనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు.

సొంత ఆటో, కారు ఉన్నవారికి ఏటా రూ. 10 వేల సాయాన్ని అందిస్తామని జగన్ చెప్పారు. ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్ధి పొందుతారని చెప్పారు. డ్రైవర్ల అకౌంట్లలోకి ఈ డబ్బును నేరుగా జమ చేస్తామని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...