Skip to main content

రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాయాలి రాహుల్ జీ!: రాజ్ నాథ్





 రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాసిన విషయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పందించారు. హర్యానాలోని భవానీలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... విజయ దశమి రోజున ఆయుధ పూజలు చేయడం మన సంప్రదాయమని అన్నారు. తాను రాఫెల్‌ యుద్ధ విమానంపై ఓం రాశానని, అయితే, అలా ఎందుకు రాశావంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 'నేను రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ రోజు శస్త్ర పూజలో రాఫెల్ పై 'ఓం' కాకుండా మరేం రాసి ఉండాల్సింది?' అని ప్రశ్నించారు.

ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్.. తొలి రాఫెల్ విమానాన్ని అందుకుని, దానికి శస్త్ర పూజలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. ఇటీవల 'డ్రామా' అంటూ విమర్శించారు. 'ఇటువంటి మూఢనమ్మకాలు తొలగిపోయినప్పుడే భారత్ సొంతంగా రాఫెల్ వంటి యుద్ధ విమానాలను తయారు చేసుకోగలదు' అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. కాగా, హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు ఈ నెల 24న వెల్లడవుతాయి. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...