Skip to main content

మహారాష్ట్ర గవర్నర్ తో వేర్వేరుగా బీజేపీ, శివసేన నేతల సమావేశం!

 
మహారాష్ట్రలో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ డిమాండ్ పెట్టిన శివసేన.. ఇంకా తన పట్టు వీడడం లేదు. వర్లి నుంచి పోటీ చేసి గెలిచిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన కోరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం శివసేన నేత ఒకరు... గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారితో సమావేశం అయ్యారు. మరోవైపు బీజేపీ కూడా గవర్నర్ ను కలవనుంది.

శివసేన నేత దివాకర్‌ రౌత్‌.. తమ పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ తరపున గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపామని చెప్పుకొచ్చారు. తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. కాసేపట్లో బీజేపీ నేతలు కూడా గవర్నర్‌తో సమావేశం అవుతారని తెలుస్తోంది. మర్యాద పూర్వకంగా గవర్నర్ ను కలుస్తున్నట్లు ఇరు పార్టీలూ చెప్పుకోవడం గమనార్హం.

ఐదేళ్ల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ సారి తమ పార్టీకి సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే విషయంలో రిమోట్ కంట్రోల్ శివసేన చేతిలోనే ఉందని ఆ పార్టీ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో బీజేపీకి శివసేన మద్దతు తప్పనిసరి అయింది. దీంతో సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్ ను శివసేన తీసుకొచ్చింది.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...