Skip to main content

శశికళ జైలు నుంచి బయటకు రావడం తథ్యం: దినకరన్

 
 


బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సత్ప్రవర్తన మీద విడుదల అవుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆమె విడుదలవుతారన్న ప్రచారంపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ స్పందించారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో శశికళ పేరు లేదని తెలిపారు. ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలను ఆమె కూడా పాటిస్తున్నారని దినకరన్ తెలిపారు. ఖైదీల వస్త్రధారణ నిబంధనలను కూడా పాటిస్తున్నారని అన్నారు. గతంలో శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అయితే, ఆమె పూర్తి శిక్షా కాలం ముగిసే వరకు జైలులోనే ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుపుతామని న్యాయవాది రాజచెందూర్‌ పాండియన్‌ కూడా అన్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా, ఇప్పటికే రెండున్నరేళ్ల శిక్ష పూర్తయింది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...