Skip to main content

శశికళ జైలు నుంచి బయటకు రావడం తథ్యం: దినకరన్

 
 


బెంగుళూరు పరప్పన అగ్రహారం జైలులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సత్ప్రవర్తన మీద విడుదల అవుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆమె విడుదలవుతారన్న ప్రచారంపై అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ స్పందించారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో శశికళ పేరు లేదని తెలిపారు. ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలను ఆమె కూడా పాటిస్తున్నారని దినకరన్ తెలిపారు. ఖైదీల వస్త్రధారణ నిబంధనలను కూడా పాటిస్తున్నారని అన్నారు. గతంలో శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. అయితే, ఆమె పూర్తి శిక్షా కాలం ముగిసే వరకు జైలులోనే ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుపుతామని న్యాయవాది రాజచెందూర్‌ పాండియన్‌ కూడా అన్నారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడగా, ఇప్పటికే రెండున్నరేళ్ల శిక్ష పూర్తయింది.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.