Skip to main content

వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న జియో

ఐయూసీ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని జియో తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైన నేపథ్యంలో, సదరు సంస్థ నుంచి వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. అక్టోబరు 9న, అంతకుముందు రీచార్జి చేసుకున్నవాళ్లు తమ ప్లాన్ గడువు ముగిసేవరకు ఇతర నెట్ వర్క్ లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నిమిషానికి 6 పైసల చార్జి తప్పదు. దీనికోసం ప్రత్యేకంగా టాప్ అప్ కూపన్లు మార్కెట్లోకి రానున్నాయి.

ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయంతో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే, ట్రాయ్ ఐయూసీ చార్జీల నిబంధన తీసుకురావడంతో జియో తన ప్రణాళికను సమీక్షించుకోవాల్సి వచ్చింది. ఒక నెట్ వర్క్ కు చెందిన యూజర్లు మరో నెట్ వర్క్ కు కాల్ చేస్తే... కాల్ అందుకున్న నెట్ వర్క్ కు కాల్ చేసిన నెట్ వర్క్ కొంత చార్జీ చెల్లించడమే ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి).

ఇప్పటివరకు జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసుకునే కాల్స్ కు అయ్యే ఖర్చును జియోనే భరించింది. గత మూడేళ్లలో తన నెట్వర్క్ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ఇతర నెట్వర్క్ లకు వెళ్లే వాయిస్ కాల్స్ పై రూ.13,500 మేర ఐయూసీ చార్జీలు పడగా, ఆ భారం మొత్త జియోనే భరించింది. అయితే, ఇకమీదట ఆ భారం తగ్గించుకోవాలని భావించిన జియో తన యూజర్లు చేసే వాయిస్ కాల్స్ పై నిమిషానికి రూ.6 పైసలు వంతున వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.