ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద సొంత ఆటో, కారు ఉన్న డ్రైవర్లకు ప్రతి ఏటా రూ. 10 వేలను ప్రభుత్వం అందించనుంది. మరోవైపు విశాఖలో ఈ కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విశాఖలోనే 25 వేల మంది డ్రైవర్లకు సాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆటోలపై జగన్ ఫొటోలను పెట్టుకోవాలని సూచించారు. జగన్ ఫొటో పెట్టుకుంటే ఆర్టీఏ అధికారులెవరూ ఇబ్బంది పెట్టరని అన్నారు
కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్ పిటిషన్లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.
Comments
Post a Comment