విశాఖపట్నం జిల్లా కశింకోట సమీపంలో రైలు పట్టాలు విరగడంతో, విజయవాడ - విశాఖ
మధ్య నడిచే పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న
అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పట్టాలను సరిచేసే పనిలో
పడ్డారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను
నిలిపివేశారు. వీటితో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే పలు రైళ్లు గంట నుంచి
రెండు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నానికి పట్టాలను సరిచేస్తామని
అధికారులు వెల్లడించారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment