Skip to main content
సుకుమార్ - బన్నీ సినిమా మొదలైంది
 


 సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, వాళ్ల కార్యాలయంలో కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్ .. కొరటాల .. సురేందర్ రెడ్డి హాజరయ్యారు. దేవుడి చిత్ర పటాలపై అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

గతంలో సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య' .. 'ఆర్య 2' సినిమాలు యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్, తాజా చిత్రానికి కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ సినిమాలో బన్నీ జోడీగా రష్మిక మందన కనిపించనున్న సంగతి తెలిసిందే.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.