Skip to main content

మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు

మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు
 భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల రెండు రోజుల భేటీ ముగిసింది. అధికార లాంఛనాలకు దూరంగా జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల నేతలు మనసు విప్పి మాట్లాడుకున్నారు. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీపై విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు.
‘ఈ రెండు రోజుల్లో మోదీ, జిన్‌పింగ్‌ మొత్తం ఆరు గంటల పాటు ముఖాముఖి భేటీ అయ్యారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానం ద్వారా చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో భారత్‌ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, చైనా తరఫున వైస్‌ ప్రీమియర్‌ హు చుంగ్‌హువా పాల్గొంటారు’ అని విజయ్‌ గోఖలే వెల్లడించారు.
మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు
కశ్మీర్‌ ప్రస్తావన లేదు..
భేటీలో భాగంగా మోదీ, జిన్‌పింగ్‌ మధ్య కశ్మీర్‌ అంశం ప్రస్తావనే రాలేదని గోఖలే తెలిపారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని గోఖలే మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సవాళ్ల గురించి ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని జిన్‌పింగ్‌ చైనాకు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఇందుకు మోదీ కూడా అంగీకరించారని, త్వరలోనే అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు. 
నేపాల్‌ బయల్దేరిన జిన్‌పింగ్‌

భేటీ అనంతరం జిన్‌పింగ్‌కు మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుతో భారత పర్యటన ముగించుకున్న జిన్‌పింగ్‌.. చెన్నై నుంచి నేపాల్‌ బయల్దేరారు. ఆయనకు మోదీ దగ్గరుండి వీడ్కోలు పలికారు. దాదాపు 23ఏళ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు నేపాల్‌లో పర్యటించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. 

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.