Skip to main content

మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు

మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు
 భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల రెండు రోజుల భేటీ ముగిసింది. అధికార లాంఛనాలకు దూరంగా జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల నేతలు మనసు విప్పి మాట్లాడుకున్నారు. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీపై విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు.
‘ఈ రెండు రోజుల్లో మోదీ, జిన్‌పింగ్‌ మొత్తం ఆరు గంటల పాటు ముఖాముఖి భేటీ అయ్యారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానం ద్వారా చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో భారత్‌ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, చైనా తరఫున వైస్‌ ప్రీమియర్‌ హు చుంగ్‌హువా పాల్గొంటారు’ అని విజయ్‌ గోఖలే వెల్లడించారు.
మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు
కశ్మీర్‌ ప్రస్తావన లేదు..
భేటీలో భాగంగా మోదీ, జిన్‌పింగ్‌ మధ్య కశ్మీర్‌ అంశం ప్రస్తావనే రాలేదని గోఖలే తెలిపారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని గోఖలే మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సవాళ్ల గురించి ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని జిన్‌పింగ్‌ చైనాకు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఇందుకు మోదీ కూడా అంగీకరించారని, త్వరలోనే అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు. 
నేపాల్‌ బయల్దేరిన జిన్‌పింగ్‌

భేటీ అనంతరం జిన్‌పింగ్‌కు మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుతో భారత పర్యటన ముగించుకున్న జిన్‌పింగ్‌.. చెన్నై నుంచి నేపాల్‌ బయల్దేరారు. ఆయనకు మోదీ దగ్గరుండి వీడ్కోలు పలికారు. దాదాపు 23ఏళ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు నేపాల్‌లో పర్యటించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...