Skip to main content

మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు

మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు
 భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల రెండు రోజుల భేటీ ముగిసింది. అధికార లాంఛనాలకు దూరంగా జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల నేతలు మనసు విప్పి మాట్లాడుకున్నారు. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ భేటీపై విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు.
‘ఈ రెండు రోజుల్లో మోదీ, జిన్‌పింగ్‌ మొత్తం ఆరు గంటల పాటు ముఖాముఖి భేటీ అయ్యారు. ఇరువురు నేతల చర్చల అనంతరం ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానం ద్వారా చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో భారత్‌ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, చైనా తరఫున వైస్‌ ప్రీమియర్‌ హు చుంగ్‌హువా పాల్గొంటారు’ అని విజయ్‌ గోఖలే వెల్లడించారు.
మోదీ, జిన్‌పింగ్‌ భేటీలో కశ్మీర్‌ ప్రస్తావన లేదు
కశ్మీర్‌ ప్రస్తావన లేదు..
భేటీలో భాగంగా మోదీ, జిన్‌పింగ్‌ మధ్య కశ్మీర్‌ అంశం ప్రస్తావనే రాలేదని గోఖలే తెలిపారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని గోఖలే మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సవాళ్ల గురించి ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని జిన్‌పింగ్‌ చైనాకు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఇందుకు మోదీ కూడా అంగీకరించారని, త్వరలోనే అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామన్నారు. 
నేపాల్‌ బయల్దేరిన జిన్‌పింగ్‌

భేటీ అనంతరం జిన్‌పింగ్‌కు మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుతో భారత పర్యటన ముగించుకున్న జిన్‌పింగ్‌.. చెన్నై నుంచి నేపాల్‌ బయల్దేరారు. ఆయనకు మోదీ దగ్గరుండి వీడ్కోలు పలికారు. దాదాపు 23ఏళ్ల తర్వాత ఓ చైనా అధ్యక్షుడు నేపాల్‌లో పర్యటించడం మళ్లీ ఇప్పుడే కావడం విశేషం. 

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.