Skip to main content

పాకిస్థాన్ ఖాతాలో మరో అవమానం... నిజాం సంపదపై బ్రిటన్ కోర్టు కీలకతీర్పు

ఇటీవల కాలంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఏదీ కలిసిరావడంలేదు. ఐక్యరాజ్యసమితిలోనూ, అంతర్జాతీయ న్యాయస్థానంలోనూ భారత్ వాదనలకే మొగ్గు కనిపిస్తోంది. తాజాగా, 70 ఏళ్ల నాటి నిజాం సంపద కేసులో కూడా పాక్ కు పరాభవం తప్పలేదు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే... 1948లో 7వ నిజాం పేరు మీద లండన్ లోని ఓ బ్యాంకులో ఒక మిలియన్ పౌండ్ల నగదు డిపాజిట్ అయింది. నిజాం అప్పట్లో బ్రిటన్ లో పాక్ రాయబారి హబీబ్ ద్వారా ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేయించారు.

అయితే ఆ నగదు తమకే చెందుతుందని నిజాం వారసులు ముఖరం ఝా, ముఫకం ఝా వాదిస్తుండగా, అప్పట్లో తాము నిజాంకు ఆయుధాలు సరఫరా చేశామని, అందువల్ల ఆ సొమ్ము తమకే చెందాలని పాకిస్థాన్ వాదిస్తోంది. ఈ కేసులో నిజాం వారసులకు భారత్ దన్నుగా నిలిచింది. గత 70 ఏళ్లుగా ఈ కేసు హైకోర్టు ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ లో విచారణలో ఉంది. హబీబ్ కూడా నిజాం తనపై నమ్మకంతోనే ఆ నగదు పంపారని గతంలోనే చెప్పారు.

ఎన్నో దశాబ్దాల పాటు సాగిన విచారణలు, వాదోపవాదాల దరిమిలా బుధవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సంపద నిజాం వారసులకే చెందాలని, పాక్ కు దీనిపై హక్కు లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో ఉన్న ఈ నగదు త్వరలోనే నిజాం వారసుల పరం కానుంది

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...