హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రగతి భవన్ కు బైక్ పై దూసుకొచ్చిన రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ప్రాంతాలకు తిప్పారు. ప్రగతి భవన్ నుంచి గోల్కొండ ప్రాంతంలో ఉన్న గోల్ఫ్ కోర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని మరో వాహనంలోకి మార్చారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డు, పుప్పాల గూడ, నార్సింగ్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడినుంచి చివరిగా కామాటిపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Post a Comment