Skip to main content

బాలయ్యపై జగన్ ఫోకస్ ..... ఈసారి ఎలాగైనా !



సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఏకంగా 151 సీట్లు దక్కించుకుని సరికొత్త విజయాన్ని నమోదుచేసుకుంది . ఇక రాయలసీమలో కడప , కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరు , అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆ రికార్డును దక్కించుకోలేకపోయింది . దీంతో ఆ రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టారు జగన్ . వచ్చే ఎన్నికలనాటికి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట . ఆదిశగా వ్యూహాలు సిధ్ధం చేసుకుంంటున్నారంట .

ముఖ్యమంగా నందమూరి బాలయ్య నియోజకవర్గంపైనా జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంట .
వైయస్సార్సీపీ గాలిని కూడా నందమూరి బా‌లయ్య తట్టుకుని హిందూపురం నుంచి రెండోసారీ ఎమ్మెల్యేగా గెలిచారు . పాత ఇంచార్జ్ ను మైనార్టీ వ్యుహంతో మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను బరిలోకి దింపి ... వైయస్సార్సీపీ ఎన్నికలకి వెళ్లినా వర్కౌట్ కాలేదు . దీంతో ఈసారి ఎలాగైనా హిందూపురంలో పాగావేయాలని భావిస్తున్నారట అందుకే బాలయ్య నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట . హిందూపూర్ లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినా ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు .

ఇక్బాల్ కూడా హిందూపురంలో దూసుకుపోతున్నారట ఎమ్మెల్సీ హోదాలో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారంట . ఇటు బాలయ్య కూడా సినిమాల్లో బిజీగా ఉండటంతో హిందూపురం వైపు పెద్దగా వెళ్లడంలేదని దీనిని క్యాష్ చేసుకునేందుకు వైయస్సార్సీపీ పావులు కదుపుతుందని లోకల్ గా టాక్ నడుస్తుంది . టీడీపీలో ఉండే ద్వితీయ శ్రేణి కార్యకర్తలను
తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది . మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి . హిందూపురంపై పట్టుసాధించుకోవాలనే పట్టుదలతో ఉంది మరి వైయస్సార్సీపీ వ్యూహాలకు బాలయ్య టీడీపీ నేతలు ఎలా చెక్ పెడతారన్నదే ఆశక్తిగా మారింది .
ఇటు అనంతపురం జిల్లానుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆయన నియోజక వర్గం ఉరవకొండపై కూడా వైయస్సార్సీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది . మాజీ ఎమ్మెల్యే విశ్వేశర్ రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు . నియోజకవర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు . ఇటీవలే ఓ నీటి వివాదంతో నియోజకవర్గం ఒక్కసారిగా వేడెక్కింది . మొత్తంమీద జగన్ వైయస్సార్సీపీ అనంతపురం జిల్లాను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉందట .

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.