Skip to main content

బాలయ్యపై జగన్ ఫోకస్ ..... ఈసారి ఎలాగైనా !



సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఏకంగా 151 సీట్లు దక్కించుకుని సరికొత్త విజయాన్ని నమోదుచేసుకుంది . ఇక రాయలసీమలో కడప , కర్నూలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. చిత్తూరు , అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆ రికార్డును దక్కించుకోలేకపోయింది . దీంతో ఆ రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టారు జగన్ . వచ్చే ఎన్నికలనాటికి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట . ఆదిశగా వ్యూహాలు సిధ్ధం చేసుకుంంటున్నారంట .

ముఖ్యమంగా నందమూరి బాలయ్య నియోజకవర్గంపైనా జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారంట .
వైయస్సార్సీపీ గాలిని కూడా నందమూరి బా‌లయ్య తట్టుకుని హిందూపురం నుంచి రెండోసారీ ఎమ్మెల్యేగా గెలిచారు . పాత ఇంచార్జ్ ను మైనార్టీ వ్యుహంతో మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను బరిలోకి దింపి ... వైయస్సార్సీపీ ఎన్నికలకి వెళ్లినా వర్కౌట్ కాలేదు . దీంతో ఈసారి ఎలాగైనా హిందూపురంలో పాగావేయాలని భావిస్తున్నారట అందుకే బాలయ్య నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట . హిందూపూర్ లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినా ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు .

ఇక్బాల్ కూడా హిందూపురంలో దూసుకుపోతున్నారట ఎమ్మెల్సీ హోదాలో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారంట . ఇటు బాలయ్య కూడా సినిమాల్లో బిజీగా ఉండటంతో హిందూపురం వైపు పెద్దగా వెళ్లడంలేదని దీనిని క్యాష్ చేసుకునేందుకు వైయస్సార్సీపీ పావులు కదుపుతుందని లోకల్ గా టాక్ నడుస్తుంది . టీడీపీలో ఉండే ద్వితీయ శ్రేణి కార్యకర్తలను
తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది . మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి . హిందూపురంపై పట్టుసాధించుకోవాలనే పట్టుదలతో ఉంది మరి వైయస్సార్సీపీ వ్యూహాలకు బాలయ్య టీడీపీ నేతలు ఎలా చెక్ పెడతారన్నదే ఆశక్తిగా మారింది .
ఇటు అనంతపురం జిల్లానుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆయన నియోజక వర్గం ఉరవకొండపై కూడా వైయస్సార్సీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది . మాజీ ఎమ్మెల్యే విశ్వేశర్ రెడ్డి మళ్లీ రంగంలోకి దిగారు . నియోజకవర్గంలో మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు . ఇటీవలే ఓ నీటి వివాదంతో నియోజకవర్గం ఒక్కసారిగా వేడెక్కింది . మొత్తంమీద జగన్ వైయస్సార్సీపీ అనంతపురం జిల్లాను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉందట .

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...