Skip to main content

వైసీపీ, టీడీపీల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని అందుకే చెబుతున్నాం: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి



ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య క్విడ్ ప్రోకో నడుస్తోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 900 కోట్లు ఆదా చేసినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన అన్నారు. పోలవరంలో అవినీతి చోటు చేసుకున్నట్టైతే... సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ కేంద్రానికి లేఖ రాస్తే... 24 గంటల్లో చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజాధనాన్ని మింగేసిన దొంగలను జైల్లో పెడతామని అన్నారు.

పోలవరమే కాకుండా, ఇతర పనుల్లో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని విష్ణు ప్రశ్నించారు. అందుకే వైసీపీ, టీడీపీల మద్య క్విడ్ ప్రోకో ఉందని తాము అంటున్నామని తెలిపారు. కేంద్ర విచారణ సంస్థలు జోక్యం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు లేఖ రాయాలని చెప్పారు. లేఖ రాస్తే తాము వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు.

Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.