రిజిస్టేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను
విక్రయిస్తున్న గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ కు ఏపీ రవాణా శాఖ జరిమానా
విధించింది. ఈ విధంగా సదరు షోరూమ్ 576 వాహనాలు విక్రయించినట్టు రవాణాశాఖ
విచారణలో గుర్తించింది. ప్రభుత్వానికి రూ.41 లక్షల పన్నులు ఎగవేసినట్టు
అధికారుల లెక్కలో తేలింది. ఈ నేపథ్యంలో గౌతమ్ షోరూం యజమానికి కోటి రూపాయల
జరిమానాను రవాణా శాఖ కమిషనర్ విధించారు. ఇంత మొత్తంలో జరిమానా విధించడం
రవాణా శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గుంటూరు
జిల్లాలోని మరో 7 షోరూమ్ లకు రూ.39 లక్షల మేరకు జరిమానాలు విధించినట్టు
సమాచారం. కాగా, కోటి రూపాయల జరిమానాను గౌతమ్ హీరో షోరూమ్ చెల్లించింది.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment