రిజిస్టేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను
విక్రయిస్తున్న గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ కు ఏపీ రవాణా శాఖ జరిమానా
విధించింది. ఈ విధంగా సదరు షోరూమ్ 576 వాహనాలు విక్రయించినట్టు రవాణాశాఖ
విచారణలో గుర్తించింది. ప్రభుత్వానికి రూ.41 లక్షల పన్నులు ఎగవేసినట్టు
అధికారుల లెక్కలో తేలింది. ఈ నేపథ్యంలో గౌతమ్ షోరూం యజమానికి కోటి రూపాయల
జరిమానాను రవాణా శాఖ కమిషనర్ విధించారు. ఇంత మొత్తంలో జరిమానా విధించడం
రవాణా శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గుంటూరు
జిల్లాలోని మరో 7 షోరూమ్ లకు రూ.39 లక్షల మేరకు జరిమానాలు విధించినట్టు
సమాచారం. కాగా, కోటి రూపాయల జరిమానాను గౌతమ్ హీరో షోరూమ్ చెల్లించింది.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment