రిజిస్టేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను
విక్రయిస్తున్న గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ కు ఏపీ రవాణా శాఖ జరిమానా
విధించింది. ఈ విధంగా సదరు షోరూమ్ 576 వాహనాలు విక్రయించినట్టు రవాణాశాఖ
విచారణలో గుర్తించింది. ప్రభుత్వానికి రూ.41 లక్షల పన్నులు ఎగవేసినట్టు
అధికారుల లెక్కలో తేలింది. ఈ నేపథ్యంలో గౌతమ్ షోరూం యజమానికి కోటి రూపాయల
జరిమానాను రవాణా శాఖ కమిషనర్ విధించారు. ఇంత మొత్తంలో జరిమానా విధించడం
రవాణా శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గుంటూరు
జిల్లాలోని మరో 7 షోరూమ్ లకు రూ.39 లక్షల మేరకు జరిమానాలు విధించినట్టు
సమాచారం. కాగా, కోటి రూపాయల జరిమానాను గౌతమ్ హీరో షోరూమ్ చెల్లించింది.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment