ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఏ ఫంక్షన్ నిర్వహించినా ప్రకటనలకు, స్నోలు, పౌడర్లు, సోకులకు కోట్ల రూపాయలు దుబారా చేశారని ఆరోపించారు. తాను చేపట్టిన పురపాలక శాఖ విషయానికొస్తే, తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి రూ.15 వేల కోట్ల అప్పు ఉందని అన్నారు. భారీగా బకాయిలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుభవజ్ఞులమని చెప్పుకుంటూ ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. ఇక, రహదారులపై ఉండే అనాథల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment