Skip to main content

సంప్రదాయాలపై నాకు విశ్వాసం ఉంది...అందుకే పూజలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరణ

ప్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానం మొట్ట మొదటిది అందుకున్న సమయంలో ఆయుధ పూజ నిర్వహించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. బాల్యం నుంచి తనకు ఆచార, సంప్రదాయాలపై నమ్మకం ఉందని, ఆ నమ్మకంలో భాగంగానే కొత్త వస్తువు స్వీకరించి వినియోగిస్తున్న సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

రాఫెల్ విమానాన్ని స్వీకరించిన సందర్భంగా మంత్రి పూజలు జరిపి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచడం, పసుపు కుంకుమతో ఓం అని రాయడంపై విపక్షాలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి స్పందించారు.

మత విశ్వాసం ప్రకారం పూజలు చేసుకునే హక్కు భారతీయులకు ఉందని, అందువల్ల తాను చేసింది తప్పుకాదన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే చేస్తానన్నారు. వాస్తవానికి ఈ అంశంపై విమర్శల్లో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

కాగా రాజ్‌నాథ్‌ పూజలకు పాకిస్థాన్‌ మద్దతు తెలపడం విశేషం. ఆ దేశ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ మత విశ్వాసాల ప్రకారం పూజలు తప్పుకాదన్నారు. అయితే కేవలం ఆయుధాలతో మాత్రమే గెలవలేమని, వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్థ్యంపై విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.