Skip to main content

సంప్రదాయాలపై నాకు విశ్వాసం ఉంది...అందుకే పూజలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరణ

ప్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానం మొట్ట మొదటిది అందుకున్న సమయంలో ఆయుధ పూజ నిర్వహించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. బాల్యం నుంచి తనకు ఆచార, సంప్రదాయాలపై నమ్మకం ఉందని, ఆ నమ్మకంలో భాగంగానే కొత్త వస్తువు స్వీకరించి వినియోగిస్తున్న సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

రాఫెల్ విమానాన్ని స్వీకరించిన సందర్భంగా మంత్రి పూజలు జరిపి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచడం, పసుపు కుంకుమతో ఓం అని రాయడంపై విపక్షాలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి స్పందించారు.

మత విశ్వాసం ప్రకారం పూజలు చేసుకునే హక్కు భారతీయులకు ఉందని, అందువల్ల తాను చేసింది తప్పుకాదన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే చేస్తానన్నారు. వాస్తవానికి ఈ అంశంపై విమర్శల్లో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

కాగా రాజ్‌నాథ్‌ పూజలకు పాకిస్థాన్‌ మద్దతు తెలపడం విశేషం. ఆ దేశ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ మత విశ్వాసాల ప్రకారం పూజలు తప్పుకాదన్నారు. అయితే కేవలం ఆయుధాలతో మాత్రమే గెలవలేమని, వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్థ్యంపై విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.