Skip to main content

సంప్రదాయాలపై నాకు విశ్వాసం ఉంది...అందుకే పూజలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వివరణ

ప్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానం మొట్ట మొదటిది అందుకున్న సమయంలో ఆయుధ పూజ నిర్వహించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. బాల్యం నుంచి తనకు ఆచార, సంప్రదాయాలపై నమ్మకం ఉందని, ఆ నమ్మకంలో భాగంగానే కొత్త వస్తువు స్వీకరించి వినియోగిస్తున్న సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

రాఫెల్ విమానాన్ని స్వీకరించిన సందర్భంగా మంత్రి పూజలు జరిపి చక్రాల కింద నిమ్మకాయలు ఉంచడం, పసుపు కుంకుమతో ఓం అని రాయడంపై విపక్షాలు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై మంత్రి స్పందించారు.

మత విశ్వాసం ప్రకారం పూజలు చేసుకునే హక్కు భారతీయులకు ఉందని, అందువల్ల తాను చేసింది తప్పుకాదన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే చేస్తానన్నారు. వాస్తవానికి ఈ అంశంపై విమర్శల్లో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

కాగా రాజ్‌నాథ్‌ పూజలకు పాకిస్థాన్‌ మద్దతు తెలపడం విశేషం. ఆ దేశ సైనిక విభాగం అధికార ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ స్పందిస్తూ మత విశ్వాసాల ప్రకారం పూజలు తప్పుకాదన్నారు. అయితే కేవలం ఆయుధాలతో మాత్రమే గెలవలేమని, వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్థ్యంపై విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...