Skip to main content

ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు

 ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు
ఆర్టీసీ కార్మికులతో ముగిసిన చర్చలు
ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. తొలి విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయని, మళ్లీ ఎప్పుడు చర్చలకు పిలిస్తే అప్పుడు హాజరవుతామని చెప్పారు. అన్ని అంశాలపై తాము చర్చలు జరపాలని కోరామని, కానీ కొన్ని అంశాలకు మాత్రమే వారు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు, కార్మికుల తరఫున ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి, మరో ముగ్గురు కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇవి నిర్బంధ చర్చలు. మా సెల్ ఫోన్లు లాక్కున్నారు. 21 అంశాలపై మాట్లాడుతామని యాజమాన్యం అంది. మేం 26 అంశాలపై చర్చలను జరపాలని కోరాం. 21 అంశాలు ఆర్థిక అంశాలకు సంబంధం లేదని కోర్టు చెప్పింది. యాజమాన్యం ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని మాట్లాడింది. అన్ని అంశాలపై చర్చలు జరపాలని కోరాం. మా వాళ్లతో లోపల జరిగిన అంశాలపై చర్చిస్తాం. మళ్లీ చర్చలు జరిపితే సిద్ధంగా ఉన్నాం’’ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు. కోర్టు కోసమే చర్చలు జరిపినట్లు ఉందని ఆరోపించారు. శత్రు దేశాలతో కూడా ఇటువంటి చర్చలు ఎప్పుడూ జరగలేదని మరో కన్వీనర్‌ వీఎస్‌ రావు అన్నారు. జేఏసీ నేతలే చర్చలకు సహకరించలేదనేలా వ్యవహరించారని విమర్శించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...