Skip to main content

లాంగ్ మార్చ్ సన్నాహక సమావేశం నిర్వహించిన జనసేన



రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి అష్టకష్టాలు పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికులకు సంఘీభావంగా పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నవంబరు 3, లేదా నవంబరు 4న వైజాగ్ లో లాంగ్ మార్చ్ పేరిట భారీ ర్యాలీ చేపట్టనుంది. నిన్న జరిగిన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీని జనసేనాని పవన్ కల్యాణ్ ముందుండి నడిపించనున్నారు.

అయితే, ర్యాలీ విధి విధానాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్వహించాలి అనే అంశాలు నిర్ధారించేందుకు పార్టీ అగ్రనేతలు లాంగ్ మార్చ్ సన్నాహాక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ వంటి ముఖ్యనేతలు నేతృత్వం వహించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.