Skip to main content

ఆర్టీసీ సమ్మె మరింత ఉద్ధృతం...కండక్టర్‌ ఆత్మహత్య






ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్ గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమ్మెకు జ్వరం కారణంగా వారం రోజులు సెలవులో ఉన్న సురేందర్.. గత నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసి తీవ్రంగా కలతచెందారు.
ఏడాది కిందట కుమార్తెకు వివాహం చేసిన సురేందర్‌గౌడ్.. ఇందుకు స్టేట్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతినెల వచ్చిన జీతంతో వాయిదాలు చెల్లిస్తుండగా, సెప్టెంబరు మాసం వేతనం ప్రభుత్వం చెల్లించకపోవడంతో చెక్కు బౌన్స్ అయ్యింది. ఈ మేరకు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని, రుణం ఎలా తీర్చాలనే ఆందోళనకు గురైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సురేందర్‌గౌడ్‌ ఉద్యోగం పోయింది. దీంతో మనస్తాపం చెందిన సురేందర్‌గౌడ్‌ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా నర్సంపేటలో ఒక డ్రైవర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను నిలువరించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్‌లో ఒక్క బస్సూ తిరగలేదు. సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాము కూడా జీతాలు తీసుకోవద్దని నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్లలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
వారి నిర్ణయంపై ఆర్టీసీ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. తమకు గొప్ప మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపింది. సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం ఏపీఎస్‌ ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.