Skip to main content

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ మరో చాన్స్!

గత రాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉదయం కొందరు ఉన్నతాధికారులు సీఎంను కలువగా, సమ్మెను విరమించి, వెంటనే విధుల్లోకి రావాలని మరోసారి పిలుపునివ్వాలని సీఎం సూచించినట్టు సమాచారం. కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందిస్తే, కొన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కార్మికులకు అనుకూల నిర్ణయాలు తీసుకుందామని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కార్మికులు విధుల్లోకి వచ్చినా, రాకున్నా సాధ్యమైనన్ని ఎక్కువ బస్సులను తిప్పాలని కేసీఆర్ సూచించినట్టు ఓ అధికారి వెల్లడించారు. అద్దె బస్సుల కోసం సాయంత్రంలోగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయనున్న సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...