Skip to main content

మా’ తీరుపై నిప్పులు చెరిగిన నటుడు పృథ్వీరాజు


 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తార స్థాయికి చేరాయి. ‘మా’ సమావేశంపై ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మా’ సర్వసభ్య సమావేశం వుందని తిరుపతి నుంచి వచ్చానని, ఈ మీటింగ్ చూస్తే దౌర్భాగ్యంగా వుందని విమర్శించారు. నాలుగు వందల సినిమాలకు మాటలు రాసిన ప్ర ముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణను కూడా ఈ సమావేశంలో మాట్లాడనివ్వలేదని విమర్శించారు. 

పరుచూరి గోపాలకృష్ణ కళ్ల వెంట నీరు పెట్టుకుని వెళ్లిపోవడం చూశానని, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఈ సమావేశంలో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదని, ఒకరినొకరు అరుచుకుంటున్నారని, ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ఈ మధ్య జరిగిన ‘మా’ఎన్నికల్లో తాను గెలిచినందుకు ఆనందపడాలో, ఈ సమావేశానికి వచ్చినందుకు బాధపడాలో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ‘మా’ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు దాటిపోయిందని, ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా ఫీలవుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఈ పదవి అక్కర్లేదని రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.