Skip to main content

మా’ తీరుపై నిప్పులు చెరిగిన నటుడు పృథ్వీరాజు


 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తార స్థాయికి చేరాయి. ‘మా’ సమావేశంపై ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మా’ సర్వసభ్య సమావేశం వుందని తిరుపతి నుంచి వచ్చానని, ఈ మీటింగ్ చూస్తే దౌర్భాగ్యంగా వుందని విమర్శించారు. నాలుగు వందల సినిమాలకు మాటలు రాసిన ప్ర ముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణను కూడా ఈ సమావేశంలో మాట్లాడనివ్వలేదని విమర్శించారు. 

పరుచూరి గోపాలకృష్ణ కళ్ల వెంట నీరు పెట్టుకుని వెళ్లిపోవడం చూశానని, ఇది చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. ఈ సమావేశంలో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదని, ఒకరినొకరు అరుచుకుంటున్నారని, ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ఈ మధ్య జరిగిన ‘మా’ఎన్నికల్లో తాను గెలిచినందుకు ఆనందపడాలో, ఈ సమావేశానికి వచ్చినందుకు బాధపడాలో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ‘మా’ ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు దాటిపోయిందని, ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరూ ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా ఫీలవుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తనకు ఈ పదవి అక్కర్లేదని రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...