Skip to main content

తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి పేర్ని నాని

 



ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు, తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్, పొరుగు సేవల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్, సాధారణ పరిపాలన శాఖ అజమాయిషీలో పొరుగు సేవల కార్పొరేషన్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ పథకానికి రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాగా ఉన్నట్టు చెప్పారు. వైఎస్సార్ చేనేత నేస్తం కింద ఒకేసారి రూ.24 వేలు సాయం చేయాలని, ఏటా డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనేందుకు నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని, హోంగార్డులకు ఇచ్చే రోజువారీ జీతభత్యం రూ.710కు, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, నవంబరు 21 నుంచి అమలు చేస్తామని, ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...