Skip to main content

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం భేష్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు

ఆర్టీసీ విలీనం విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. ఆర్టీసీ ఉద్యోగుల ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం ఎంపీ కేశినేని నాని కల్పించిన వసతి సౌకర్యాలను రవాణాశాఖ మంత్రి పేర్నినాని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం శుభపరిణామమని అన్నారు.

కేశినేని వ్యాఖ్యలపై మంత్రి పేర్నినాని స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంపీ ప్రశంసించడాన్ని అభినందించారు. రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేసిన ఎంపీపై ప్రశంసలు కురిపించారు. ఆర్టీసీ విలీనంపై చంద్రబాబు మౌనం వహిస్తుంటే ఆ పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.