Skip to main content

ఫరూ‌క్ అబ్దుల్లాను కలిసిన ఎన్సీ ప్రతినిధి బృందం


జమ్మూ: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీకి చెందిన 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఆదివారంనాడు కలుసుకుంది. రెండు నెలలుగా గృహనిర్బంధంలో ఉన్న ఫరూక్‌ను ఆయన నివాసంలో ప్రతినిధి బృందం కలుసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ సింగ్ రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ ఉదయం శ్రీనగర్‌కు చేరుకుని నేరుగా ఫరూక్ నివాసానికి వెళ్లింది. ఫరూక్‌ను కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎన్సీ ప్రతినిధి బృందం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కోరడంతో ప్రభుత్వ యంత్రాగం అందుకు అనుమతించింది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...